
రైతుల బాగుకే రైతునేస్తం
రైతునేస్తం కార్యక్రమం రైతులకు గొప్ప అవకాశం. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికా రులు రైతులతో ముఖాముఖి చర్చించి సాగు పద్ధతులతో తెలియజేయడంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేస్తారు. రైతునేస్తం కార్యక్రమం ద్వారా అభ్యుదయ రైతుల అనుభవాలు చూడడం వల్ల రైతుల్లో వ్యవసాయంపై నమ్మకం పెరుగుతుంది. జిల్లాలో అదనంగా 34 రైతువేదికల్లో సోమవారం నుంచి రైతునేస్తం సేవలు అందుబాటులోకి వస్తాయి. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్రెడ్డి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతునేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించి రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రజాప్రతినిధులు, రైతులు రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొనాలి.
– గోపాల్, జిల్లా వ్యవసాయ అధికారి