
సారవంతమైన నేలల్లో అధిక దిగుబడులు
కొనసాగుతున్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
వికసించిన బ్రహ్మ కమలం
నల్లగొండ టూటౌన్: నల్లగొండ పట్టణంలోని అలకాపురి కాలనీకి చెందిన ఇడుకుల్ల మంజులపద్మాకర్ నివాసంలో ఆదివారం రాత్రి బ్రహ్మ కమలం వికసించింది. ఇలాంటి మొక్కలను ఆలయాల్లో మాత్రమే పెంచుతుంటారు. ఇవి రాత్రి సమయంలో మాత్రమే వికసించి గంట మాత్రమే ఉంటాయి. ఈ బ్రహ్మ కమలం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన పుష్పంగా చెబుతుంటారు.
హుజూర్నగర్ : హుజూర్నగర్లో గల గోదాదేవి, పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఆలయంలో అగ్నిప్రతిష్ఠ, శాంతిపాఠం, గరుడ హోమం, చతుస్థానార్చన, ధ్వజారోహణం నిర్వహించారు. అనంతరం సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవ, ఎదుర్కోళ్లు, మంగళ నీరాజనం, మంత్రపుష్పం గావించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఉత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
పచ్చిరొట్టతో ఉపయోగాలు
పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగ, పిల్లిపెసర, ఉలవ, అలసందను ప్రధాన పంటల సాగుకు ముందు సాగు చేసి కలియ దున్నుకోవాలి. పచ్చిరొట్ట ఎరువుల్లో సేంద్రియ పదార్ధం ఉంటుంది. సూక్ష్మజీవులు విస్తారంగా వృద్ధి చెంది భూసారం పెరుగుతుంది. భూమి గుల్లబారి నీటి నిలువ శాతం పెరిగి సులభంగా నీరు, గాలి వేర్లకు అందుతుంది. సూక్ష్మపోషక పదార్థ లోపాలు రాకుండా ఉంటాయి. పచ్చిరొట్ట పైర్లు భూమిలో కుళ్లేటప్పుడు రసాయనిక ప్రక్రియలు జరిగి మొక్కలకు పోషక పదార్థాలు అందుతాయి.
త్రిపురారం: సారవంతంగా నేలలు ఉంటేనే చీడపీడల ఉధృతిని తగ్గించుకోవచ్చని కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాసరావు చెబుతున్నారు. రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, శాస్త్రీయ పద్ధతుల్లో నేలలను సారవంతం చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. నేలలను సారవంతం చేసుకోవడానికి ఆయన సలహాలు, సూచనలు ఇవీ..
గొర్రెల మందలతో అధిక ప్రయోజనాలు
నేలలను సారవంతంగా చేసుకోవడానికి గొర్రెల ఎరువు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇతర ప్రాంతాల నుంచి గొర్రెల కాపరులు మేత కోసం గ్రామాలకు వస్తుంటారు. ఒక్కో గొర్రెల మందలో సుమారు 150 నుంచి 500 వరకు గొర్రెలు ఉంటాయి. రైతులు గొర్రెల కాపరులతో మాట్లాడుకుని ఎకరానికి కొంత చొప్పున చెల్లించి గొర్రెల మందలను తమ పొలంలో రాత్రి సమయంలో ఉండేలా చూసుకోవాలి. ఉదయం నుంచి మేత మేసిన గొర్రెలు రాత్రి సమయంలో పెంట రూపంలో పొలంలో వదులుతాయి. అలా గొర్రెల పెంటను నేలలో కలియ దున్ని దమ్ము చేసుకుంటే నేల సారవంతంగా తయారవుతుంది.
వర్మీ కంపోస్టుతో నేల సారవంతం..
వర్మీ కంపోస్టు నిస్సారమైన భూమిని సారవంతంగా మారుస్తుంది. రసాయనిక ఎరువుల ద్వారా భూమిలో ఇంకిపోయిన భాస్వరం, పొటాషియం, నత్రజనిని తిరిగి పంటలకు ఉపయోగపడేలా చేస్తుంది. పంటలకు కావాల్సిన సూక్ష్మపోషకాలు, మధ్య పోషకాలు, జింక్ పూర్తిస్థాయిలో లభిస్తుంది. పైర్లకు చీడపీడలను తట్టుకునే శక్తిని ఇస్తుంది. ఈ ఎరువులో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల నీటి వాడకాన్ని తగ్గించుకోవచ్చు. ఎకరానికి 500 కేజీల వర్మీ కంపోస్టు వేసుకోవడం ఉత్తమం.
వర్మీ కంపోస్టు తయారు
చేసుకునే విధానం..
వర్మీ కంపోస్టు తయారీకి అవసరమైన తొట్టెలను నిర్మించుకోవాలి. ఈ తొట్టెల్లో వరి గడ్డి ఒక లేయర్గా వేసుకోవాలి. లేయర్పై ఆరబెట్టిన పేడను వేసుకొని దానిపై తడిచెత్తను వేసుకోవాలి. అలాగే మూడు రోజులు మగ్గిన తర్వాత వానపాముల సీడ్ను వేయాలి. అనంతరం జీవామృతం పోసుకొని స్ప్రేయర్ ద్వార నీళ్లు చల్లుతూ ఉండాలి. 20 నుంచి 30 రోజుల్లో వానపాములు పూర్తిస్థాయిలో ఉత్పత్తవ్వడం ద్వారా ఓ మిశ్రంలా మారుతుంది. పై భాగంలో ఉన్న మిశ్రమాన్ని జల్లించి ఆరబెట్టడం ద్వారా వర్మీ కంపోస్టు తయారవుతుంది. పై భాగంలో మిశ్రమాన్ని తీసిన ప్రతిసారి జీవామృతం పోస్తూ మగ్గబెట్టుకోవాలి. ఇలా తొట్టెల్లోని మిశ్రమాన్ని పూర్తిగా ఉపయోగించిన తర్వాత తిరిగి తయారీ ప్రారంభించుకోవాలి.
జీవ ఎరువుల వినియోగం..
గోమయం, పంచగవ్వ, గ్రీన్ మాశ్చుర్, జీవామృతం వంటి జీవ ఎరువులను వినియోగించి భూసారం కాపాడుకోవచ్చు. జీవ ఎరువులు పంటలకు పోషకాలు అందించి మట్టిని ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. మట్టిలో ఉండే సూక్ష్మజీవులకు ఆహారాన్ని అందిస్తాయి. మట్టిలో సేంద్రియ పదార్ధాలను పెంచి పైర్ల గాలితో పాటు నీటి నిల్వ సామర్థ్యాలను పెంచుతాయి. పంటలకు నెమ్మదిగా పోషకాలు అందిస్తాయి.
కంపాసాగర్ కేవీకే ప్రోగ్రాం
కోఆర్డినేటర్ శ్రీనివాసరావు సూచనలు

సారవంతమైన నేలల్లో అధిక దిగుబడులు

సారవంతమైన నేలల్లో అధిక దిగుబడులు

సారవంతమైన నేలల్లో అధిక దిగుబడులు