అధికారులను అడ్డుకున్న రైతులు | - | Sakshi
Sakshi News home page

అధికారులను అడ్డుకున్న రైతులు

Jun 16 2025 5:02 AM | Updated on Jun 16 2025 5:02 AM

అధికారులను అడ్డుకున్న రైతులు

అధికారులను అడ్డుకున్న రైతులు

చిట్యాల: మండలంలోని వట్టిమర్తి గ్రామ పరిధిలో బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు కుడి కాలువ ఏర్పాటుకు సంబంధించి భూములను సర్వే చేసేందుకు ఆదివారం వచ్చిన ఇంజనీరింగ్‌, సర్వే అధికారులను ఆ గ్రామ రైతులు అడ్డుకున్నారు. కుడి కాలువ పరిధిలో సుమారు 30 ఎకరాల భూములను రైతులు కోల్పోనున్నారు. కాగా ఈ భూములకు ప్రభుత్వ రికార్డులో మార్కెట్‌ రేట్‌ ప్రకారం సుమారు రెండున్నర లక్షల రూపాయలు ఉండగా బహిరంగ మార్కెట్‌లో కోటి రూపాయల వరకు విలువ ఉంటుంది. దీంతో రైతులు తమకు బహిరంగ మార్కెట్‌ రేట్‌ ప్రకారం పరిహారం ఇవ్వాలనే డిమాండ్‌కు అధికారులు అంగీకరించకుండా సర్వే చేయడానికి డీఈ శ్రీనివాస్‌, ఏఈ రాజశేఖర్‌రెడ్డి, సర్వేయర్‌ రజనీకాంత్‌లను అడ్డుకున్నారు. దీంతో సర్వే చేయడానికి వచ్చిన అధికారులు వెనుదిరిగారు. కార్యక్రమంలో ఆ గ్రామ రైతులు నర్రా మోహన్‌రెడ్డి, నర్రా భిక్షంరెడ్డి, అక్కెనపల్లి యాదగిరి, నర్రా లవేందర్‌రెడ్డి, దూదిగామ స్వామి, దూదిగామ మల్లయ్య, పాలాల యాదయ్య, మేడి వీరస్వామి, నర్రా శ్రీకాంత్‌రెడ్డి, లెంకల సత్తిరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement