
భక్తులు దక్షిణ ద్వారం నుంచి బయటకు వచ్చేలా..
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు పశ్చిమ ద్వారం నుంచి కాకుండా దక్షిణ ద్వారం నుంచి బయటకు వచ్చేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ప్రతిరోజు ఉచిత పులిహోర ప్రసాదం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో పశ్చిమ ద్వారం వద్ద భక్తులు ప్రసాదం తీసుకునేందుకు నిలిచిపోవడంతో పాటు బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆలయ ఈఓ వెంకట్రావ్, ఆలయాధికారులు దక్షిణ ద్వారం వద్ద భక్తులకు ఉచిత పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ బయటకు పంపిస్తున్నారు. పశ్చిమ ద్వారం గుండా సైతం భక్తులను పంపిస్తున్నామని, భక్తులకు ఇబ్బందులు కలుగవద్దనే ఉద్దేశ్యంతో దక్షిణ ద్వారం మార్గంలో ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ మాడ వీధిలోకి పంపుతున్నామని ఆలయ డిప్యూటీ ఈఓ దోర్భల భాస్కర్ శర్మ వెల్ల డించారు.
యాదగిరిగుట్ట ఆలయంలో
ప్రత్యేక ఏర్పాట్లు