
ప్రతిఒక్కరూ ధర్మాన్ని పాటించాలి
హుజూర్నగర్ (చింతలపాలెం) : ప్రతిఒక్కరూ ధర్మాన్ని పాటించాలని శ్రీరామదూత స్వామి ఆశ్రమ ప్రధాన శిష్యులు కుమారస్వామి, పూర్ణానంద దీక్షితులు, పవిత్రమ్మ, శిరీషమ్మ అన్నారు. ఆదివారం చింతలపాలెం మండలంలోని గుడిమల్కాపురం గ్రామంలో శ్రీ వేణుదత్త సువర్ణ లక్ష్మీ దాంపత్య వ్రతం, కలశపూజ, హోమం జరిపించారు. జూలై 10న గురు పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్లోని శ్రీ రామదూత స్వామి దివ్యధామంలో 120 హోమ గుండాలతో అభీష్టసిద్ధి మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నాగిరెడ్డి దంపతులు, చక్రారెడ్డి, శంబిరెడ్డి, కోటి, శంకరాచారి, శ్రీదేవి, నాగమణి పాల్గొన్నారు.