భూ భారతితో సమస్యలు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

భూ భారతితో సమస్యలు పరిష్కారం

Jun 14 2025 6:32 AM | Updated on Jun 14 2025 6:32 AM

భూ భారతితో సమస్యలు పరిష్కారం

భూ భారతితో సమస్యలు పరిష్కారం

భువనగిరి: భూ భారతి చట్టంతో భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని కలెక్టర్‌ హనుమంతరావు పేర్కొన్నారు. శుక్రవారం భువనగిరి మండలంల పెంచికల్‌పహాడ్‌లో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటిని పరిశీలించారు.రెవెన్యూ అధికారులు భూ రికార్డులతో సదస్సులకు హాజరై వీలైన సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపుతున్నారని పేర్కొన్నారు. సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, సహాయ, సహకారాలు అందజేయటానికి హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంతకుముందు రైతులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ అంజిరెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ హనుమంతరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement