ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

Jun 14 2025 6:32 AM | Updated on Jun 14 2025 6:32 AM

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

భువనగిరి: ప్రభుత్వ పాఠశాలల్లోనే అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని, నాణ్యమైన విద్య అందుతుందని జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఈఓ సత్యనారాయణ పేర్కొన్నారు. భువనగిరి మండలం తాజ్‌పూర్‌ పరిధిలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఆర్‌ఎస్‌కే ఫౌండేషన్‌ అధినేత డాక్టర్‌ ర్యాకల శ్రీనివాస్‌ సొంత ఖర్చుతో డిజిటల్‌ తరగతి గదిలో ఏర్పాటు చేసిన స్మార్ట్‌ టీవీలను శుక్రవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, డిజిటల్‌, ఆంగ్లమాధ్యమంలో చదువు చెబుతున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. ర్యాకల శ్రీనివాస్‌ను జెడ్పీ సీఈఓ, డీఈఓ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ శ్రీనివాస్‌, ఎంఈఓ నాగవర్థన్‌రెడ్డి, ఎంపీఓ దినకర్‌, పంచాయతీ కార్యదర్శి వెంకటేష్‌, మాజీ ఉపసర్పంచ్‌ ర్యాకల సంతోషశ్రీనివాస్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఫ జెడ్పీ సీఈఓ, డీఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement