
ఉల్లంఘిస్తే ఏఐ పట్టేస్తుంది!
వాహనదారులపై ఆధునిక పరిజ్ఞానంతో నిఘా
ట్యాబ్కు క్షణాల్లో సమాచారం
రోడ్లు, కూడళ్లలో ఏర్పాటు చేసిన కెమెరాలు ఆయా మార్గాల్లో వెళ్లే వాహనాల నంబర్ ప్లేట్లను క్యాప్చర్ చేస్తాయి. పన్ను చెల్లించ లేదా, బీమా ఉందా, ట్రాఫిక్ ఉల్లంఘన కేసులున్నాయా.. ఇలా సమాచారమంతా విశ్లేషించి క్షణాల్లో రవాణాశాఖ అధికారుల వద్ద ఉన్న ట్యాబ్కు చేరవేస్తాయి. కెమెరాలు ఏర్పాటు చేసిన ప్రాంతానికి దూరంగా ఉన్న అధికారుల ట్యాబ్లో వాహననంబర్ కనిపిస్తుంది. దాని ఆధారంగా వాహనదారుడు తమ దగ్గరకు రాగానే ఆపి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఏఐతో రోడ్లపై వాహనాలను ఆపి తనిఖీ చేసే విధానం ఉండదు.
ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో ఏఐ కెమెరాలు
బీబీనగర్ మండలం గూడూరు టోల్ప్లాజా, చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజాతో పాటు జాతీయ రహదారులపై, రవాణా శాఖ కార్యాలయంలో ఆటోమేటిక్ నంబర్ప్లేట్ రికగ్నేషన్ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఆ తరువాత జిల్లా వ్యాప్తంగా అవసరమైన చోట ఇంటిలెజెన్స్ ఆర్టిఫిషియల్ పరిజ్ఞానాన్ని విస్తరిస్తారు.
ఫ ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే పట్టుకోవడం, గుర్తించడం ఇక సులువు
ఫ జరిమానాలు, కేసులున్నా, బీమా, ధ్రువీకరణ పత్రాలు లేకున్నా తక్షణమే గుర్తింపు
ఫ వాహన చోరీలకు చెక్ ఫ జిల్లాలో త్వరలోనే వినియోగంలోకి కృత్రిమ మేధ
ఫ ఎంపిక చేసిన ప్రాంతాల్లో కిట్ల ఏర్పాటుకు సన్నాహాలు ఫసిబ్బందికి శిక్షణ పూర్తి
సాక్షి, యాదాద్రి: ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇకనుంచి మరో లెక్క. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వాహనదారులను గుర్తించడం, పట్టుకోవడం సులువు కానుంది. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు జిల్లా రవాణా శాఖ సిద్ధమవుతోంది. ఏఐ టూల్స్ వినియోగంపై రవాణాశాఖలోని ట్రాన్స్పోర్టు కానిస్టేబుల్స్, ఏఎంవీఐలకు ఇప్పటికే హైదరాబాద్లో శిక్షణ పొందారు. జిల్లాలోనూ కృత్రిమ మేదాను వినియోగించేందుకు శిక్షణ తీసుకున్న సిబ్బంది కసరత్తు ప్రారంభించారు. వాహనదారులను క్యాప్చర్ చేసేందుకు ఎక్కడెక్కడ ఏఐ కెమెరాలు, పరికరాలు ఏర్పాటు చేయాలి, ఎంత ఖర్చవుతందనే వివరాలతో రవాణా శాఖ ఉన్నతాధికారులకు
ప్రతిపాదనలు పంపారు.
నిత్యం వేలాది వాహనాల రాకపోకలు

ఉల్లంఘిస్తే ఏఐ పట్టేస్తుంది!