అవగాహన కల్పించి.. సందేహాలు తీర్చి | - | Sakshi
Sakshi News home page

అవగాహన కల్పించి.. సందేహాలు తీర్చి

Jun 14 2025 6:32 AM | Updated on Jun 14 2025 6:32 AM

అవగాహ

అవగాహన కల్పించి.. సందేహాలు తీర్చి

భువనగిరి: వ్యవసాయాన్ని లాభసాటి చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం ముగిసింది. మే 5న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈనెల 13వ తేదీ వరకు 40 రోజుల పాటు కొనసాగింది. ఆచార్య జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉద్యానవన, ఆయిల్‌ఫెడ్‌, భూగర్భ జలవనరుల శాఖ అధికారులను ప్రభుత్వం భాగస్వాములను చేసింది. వీరంతా ఆరు బృందాలుగా ఏర్పడి ఎంపిక చేసిన గ్రామాల్లో రైతులతో సమావేశాలు నిర్వహించారు. మెరుగైన సాగు పద్ధతులకు సంబంధించి ఆరు అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.

ఈ అంశాలపై అవగాహన

● అవసరానికి మించి యూరియా వాడుతున్నారని, దాని వాడకం తగ్గించాలి. యూరియా వాడడం వల్ల లాభ, నష్టాలపై వివరించారు.

● అధిక దిగుబడుల కోసం రైతుల అవసరానికి మించి రసాయనానలు వాడుతున్నారు. దాని ప్రభావం వాతావరణం, రైతుల ఆరోగ్యం పడుతుంది. అదే కాకుండా పెట్టుబడుల వ్యయం కూడా పెరుగుతుందన్నారు.

● విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు రశీదు తప్పనిసరిగా తీసుకోవాలి. సాగు కాలం ముగిసేదాకా రశీదును భద్రపర్చుకోవాలి. రశీదు ఉండటం వల్ల విత్తనాలు, పురుగు మందుల కారణంగా నష్టపోతే పరిహారం పొందవచ్చని సూచించారు.

● వరి సాగుకున నీటిని ఎక్కువగా వాడకూడదు. రెండు, మూడు రోజులకు ఒకసారి పొలంలో తడి ఉంటే సరిపోతుందన్నారు.

● పంట మార్పిడి చేయాలి. రాష్ట్రంలో 95 మంది రై తులు వరి, పత్తి సాగు చేస్తున్నారని.. పంట మా ర్పిడి వల్ల సుస్థిర ఆదాయం పొందడమే కా కుండా భూమి సారం కోల్పోకుండా ఉంటుందన్నారు.

● నీటి వృథా చేయవద్దు. నీటి సంరక్షణ చర్యలు పాటించి భవిష్యత్‌ తరాలకు నీటి ముప్పు రాకుండా చూడాలి.

రైతుల నుంచి మంచి స్పందన వచ్చింది

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి రైతుల నుంచి మంచి స్పందన లభించింది. రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చి సాగు విధానాల గురించి తెలుసుకోవడంతో పాటు తమ సందేహాలను వ్యక్తపరిచారు. శాస్త్రవేత్తలు వారి సందేహాలను నివృత్తి చేశారు. మెరుగైన సాగు పద్ధతులు, విత్తన ఎంపిక, ఎరువుల వాడకంపై తదితర అంశాలపై అవగాహన కల్పించారు. వానాకాలం సీజన్‌ ప్రారంభానికి ముందే రైతులను సన్నద్ధం చేయటానికి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించాం.

–అనిల్‌కుమార్‌, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త

85 గ్రామాల్లో 4,738 మంది రైతులతో మమేకమైన శాస్త్రవేత్తలు

ఫ మెరుగైన సాగు పద్ధతులపై అవగాహన

ఫ కర్షకుల ప్రశ్నలకు సమాధానం

ఫ ముగిసిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’

విత్తన ఎంపిక, ఎరువుల వాడకంపైనే అధికం..

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ఎంపిక చేసిన 85 గ్రామాల్లో 4,738 మంది రైతులు హాజరయ్యారు. ఇందులో పురుషులు 3,981, మహిళా రైతులు 757 మంది ఉన్నారు. నూతన సాగు పద్ధతులు, సాంకేతిక పరికరాలు, విత్తన ఎంపిక, ఎరువుల వినియోగం తదితర అంశాలపై ప్రశ్నలు వేశారు. ముఖ్యంగా నకిలీ విత్తనాలతో నష్టపోతున్నామని, సమస్యను ఎలా అధిగమించాలని ఎక్కువ మంది రైతులు కోరారు. అలాగే ఏ పంటకు ఏ సమయంలో, ఎటువంటి ఎరువులు వాడాలి, ఎలా వినియోగించాలని ప్రశ్నలు వేశారు. రైతుల సందేహాలను శాస్త్రవేత్తలు నివృత్తి చేశారు.

అవగాహన కల్పించి.. సందేహాలు తీర్చి1
1/1

అవగాహన కల్పించి.. సందేహాలు తీర్చి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement