
మూడు నెలలు ఆగాల్సిందే..
భువనగిరి: కొత్తగా రేషన్కార్డులు మంజూరైన లబ్ధిదారులు బియ్యంకోసం మూడు నెలలు ఆగాల్సిందే. జూన్, జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి ఈనెలలోనే పంపిణీ చేస్తున్నారు. మే 20వ తేదీ కంటే ముందు కార్డులు పొందిన వారికి కోటా ప్రకారం ప్రభుత్వం బియ్యం కేటాయించింది. దీంతో మే 20 తర్వాత కార్డులు పొందిన లబ్ధిదారులకు సెప్టెంబర్లో బియ్యం అందనున్నాయి.
13,587 మెట్రిక్ టన్నుల బియ్యం అలాట్
జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన, గ్రామసభలు, మీ సేవ కేంద్రాల ద్వారా 1,96,105 దరఖాస్తులు వచ్చాయి. మీసేవల్లో వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి కార్డులు మంజూరు చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఏప్రిల్ నెల నుంచి మొదలైంది. పాతవి, కొత్త కార్డులు కలిపి మే 20వ తేదీ నాటికి జిల్లాలో 2,18,963 కార్డులు, 7.09 లక్షల యూనిట్లు ఉన్నాయి. మూడు నెలలకు సంబంధించి 13,587 మెట్రిక్ టన్నుల బియ్యం కోటాను ప్రభుత్వం కేటాయించగా.. ప్రస్తుతం కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు.
ఫ మే 20 తర్వాత మంజూరైన కార్డులకు సెప్టెంబర్లోనే రేషన్ బియ్యం
ఫ ప్రస్తుత కోటా 65 శాతం పంపిణీ పూర్తి
ఫ 1,640 మంది కార్డుదారులకు తప్పని నిరీక్షణ
1,640 దరఖాస్తులు
మే 20వ తేదీ తర్వాత 1,640 కార్డులు జారీ అయ్యాయి. ఇందులో 3,250 యూనిట్లు ఉన్నాయి. వారందరికీ సెప్టెంబర్లోనే రేషన్ బియ్యం అందనున్నాయి.లబ్ధిదారులకు ఒకేసారి పంపిణీ చేస్తున్న మూడు నెలల బియ్యం పంపిణీ 65 శాతం పూర్తయినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.