వయోవృద్ధులను గౌరవించాలి | - | Sakshi
Sakshi News home page

వయోవృద్ధులను గౌరవించాలి

Jun 13 2025 4:36 AM | Updated on Jun 13 2025 4:36 AM

వయోవృద్ధులను గౌరవించాలి

వయోవృద్ధులను గౌరవించాలి

భువనగిరి: వయోవృద్ధులను చులకన భావంతో చూడవద్దని, వృద్ధాప్యం, ఆరోగ్యస్థితిని దృష్టిలో ఉంచుకుని వారికి సేవలందించాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, జడ్జి మాధవిలత సూచించారు. గురువారం భువనగిరి మండలం చీమలకొండూరు పరిధిలోని బెజ్జ లక్ష్మయ్య ఫౌండేషన్‌ వయోవృద్ధుల ఆశ్రమాన్ని ఆమె సందర్శించారు. ఆశ్రమ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. వయోవృద్ధులు ఒంటరివారు కారని, వారి సంరక్షణకు చట్టాలు, హక్కులు ఉన్నట్లు చెప్పారు. అనంతరం వృద్ధులతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అదే విధంగా గ్రామ పరిధిలో ఉన్న కోళ్ల ఫారంను సందర్శించి కూలీలతో మాట్లాడారు. పిల్లలు రేపటి దేశ సంపదని, వారిని పనిలో పెట్టవద్దని, పాఠశాలలకు పంపించాలని తల్లిదండ్రులకు సూచించారు. బడీడు పిల్లలను పాఠశాలలకు, అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని అధికారులను అదేశించారు. ఆమె వెంట పారా లీగల్‌ వలంటీర్లు మల్లేశం తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement