కార్పొరేట్‌ కళాశాలలకు 40 మంది ఎంపిక | - | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ కళాశాలలకు 40 మంది ఎంపిక

Jun 13 2025 4:36 AM | Updated on Jun 13 2025 4:36 AM

కార్పొరేట్‌ కళాశాలలకు 40 మంది ఎంపిక

కార్పొరేట్‌ కళాశాలలకు 40 మంది ఎంపిక

భువనగిరిటౌన్‌ : 2025–26 విద్యా సంవత్సరానికి గాను కార్పొరేట్‌ కళాశాల పథకానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో లాటరీ ద్వారా 40 మందిని ఎంపిక చేశారు. వారికి అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు గురువారం ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యమని, కార్పొరేట్‌ కళాశాలలకు ఎంపికై న వారికి ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తుందన్నారు. కేటాయించిన కళాశాలల్లో ఈనెల 21లోపు చేరాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి జినుకల శ్యాంసుందర్‌, వెనుకబడిన తరగతుల అధికారి జిల్లా యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement