
మూత‘బడి’నవి ఓపెన్
విద్యార్థులు లేక మూతబడిన పలు పాఠశాలలు తెరుచుకున్నాయి. యావాపూర్, మహదేవ్పూర్, లక్ష్మిదేవిగూడెం, పెద్దపలు గుతండా, సోమరాజు బావి, బైరాంనగర్, పోతిరెడ్డిపల్లి, నూనెగూడెంలోని ప్రాథమిక పాఠశాలలు విద్యార్థులు లేక మూసివేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, పదో తరగతిలో సాధించిన ఫలితాలు, నాణ్యమైన భోజనం తదితర అంశాలపై ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను కలిసి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడంలో సఫలీకృతం అయ్యారు. బొమ్మలరామారం మండలం యావాపూర్తండా ప్రాథమిక పాఠశాలను ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ప్రారంభించారు.