
గవర్నర్ పర్యటనలో అపశృతి
భూదాన్పోచంపల్లి: భూదాన్పోచంపల్లిలో గురువారం గవర్నర్ జిష్ణుదేవ్వర్మ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. గవర్నర్ పర్యటన నేపథ్యంలో జనరేటర్ వాహనం నుంచి వినోబాభావే మందిరం గోడపై నుంచి టూరిజం పార్కులోనికి కరెంట్ వైరును అమర్చారు. ఈ క్రమంలో వినోబాభావే మందిరం టాయ్లెట్ స్లాబ్ గోడ పైనుంచి వెళ్తున్న వైరు కిందపడకుండా దాని మీద రాయి పెట్టారు. ఇది తెలియని పోచంపల్లికి చెందిన చేనేత కార్మికుడు చింతకింది యాదగిరి వినోబాభావే మందిరం ప్రాంగణంలో కూర్చున్నాడు. ఈ క్రమంలో డ్రైవర్ జనరేటర్ వాహనాన్ని ముందుకు తీసుకెళ్లడంతో వైరుపై ఉంచిన రాయి యాదగిరి తలపై పడటంతో తలకు తీవ్రగాయమైంది. వెంటనే అక్కడే ఉన్న డాక్టర్లు అతడికి ప్రథమ చికిత్స చేశారు. గాయమైన ప్రదేశంలో కుట్లు వేశారు.
ఫ గోడ పైనుంచి రాయి మీద పడి
చేనేత కార్మికుడి తలకు గాయం