గవర్నర్‌ పర్యటనలో అపశృతి | - | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ పర్యటనలో అపశృతి

Jun 13 2025 4:35 AM | Updated on Jun 13 2025 4:35 AM

గవర్నర్‌ పర్యటనలో అపశృతి

గవర్నర్‌ పర్యటనలో అపశృతి

భూదాన్‌పోచంపల్లి: భూదాన్‌పోచంపల్లిలో గురువారం గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. గవర్నర్‌ పర్యటన నేపథ్యంలో జనరేటర్‌ వాహనం నుంచి వినోబాభావే మందిరం గోడపై నుంచి టూరిజం పార్కులోనికి కరెంట్‌ వైరును అమర్చారు. ఈ క్రమంలో వినోబాభావే మందిరం టాయ్‌లెట్‌ స్లాబ్‌ గోడ పైనుంచి వెళ్తున్న వైరు కిందపడకుండా దాని మీద రాయి పెట్టారు. ఇది తెలియని పోచంపల్లికి చెందిన చేనేత కార్మికుడు చింతకింది యాదగిరి వినోబాభావే మందిరం ప్రాంగణంలో కూర్చున్నాడు. ఈ క్రమంలో డ్రైవర్‌ జనరేటర్‌ వాహనాన్ని ముందుకు తీసుకెళ్లడంతో వైరుపై ఉంచిన రాయి యాదగిరి తలపై పడటంతో తలకు తీవ్రగాయమైంది. వెంటనే అక్కడే ఉన్న డాక్టర్లు అతడికి ప్రథమ చికిత్స చేశారు. గాయమైన ప్రదేశంలో కుట్లు వేశారు.

గోడ పైనుంచి రాయి మీద పడి

చేనేత కార్మికుడి తలకు గాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement