యాదగిరీశుడి సేవలో హిమాచల్‌ప్రదేశ్‌ సీఎస్‌ | - | Sakshi
Sakshi News home page

యాదగిరీశుడి సేవలో హిమాచల్‌ప్రదేశ్‌ సీఎస్‌

Jun 13 2025 4:35 AM | Updated on Jun 13 2025 4:35 AM

యాదగి

యాదగిరీశుడి సేవలో హిమాచల్‌ప్రదేశ్‌ సీఎస్‌

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ ప్రబోధ్‌ సక్సేనా గురువారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, ఈఓ వెంకట్రావ్‌, కలెక్టర్‌ హనుమంతరావు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా.. ఆలయాధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు.

హుండీ ఆదాయం రూ.4.47 కోట్లు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీల్లో భక్తులు సమర్పించుకున్న కానుకలను కొండ కింద గల సత్యనారాయణస్వామి వ్రత మండపంలో ఈఓ వెంకట్రావ్‌, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి ఆధ్వర్యంలో గురువారం ఆలయ ఉద్యోగులు, సిబ్బంది లెక్కించారు. ఈ లెక్కింపులో నగదు రూ.4,47,66,560, మిశ్రమ బంగారం 115 గ్రాములు, మిశ్రమ వెండి 6.50 కిలోలు వచ్చినట్లు ఈఓ వెల్లడించారు. వీటితో పాటు వివిధ దేశాలకు చెందిన కరెన్సీ వచ్చినట్లు తెలిపారు. ఈ హుండీ ఆదాయం 44 రోజులదిగా ఈఓ పేర్కొన్నారు.

యాదగిరీశుడి సేవలో హిమాచల్‌ప్రదేశ్‌ సీఎస్‌1
1/1

యాదగిరీశుడి సేవలో హిమాచల్‌ప్రదేశ్‌ సీఎస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement