
చేనేత సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేద
చేనేత కార్మికుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. గురువారం నల్లగొండ పట్టణంలోని పద్మానగర్ కాలనీలో చేనేత కార్మికుల మగ్గాలను ఆయన పరిశీలించి మాట్లా డారు. చేనేత కార్మికుల హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. చేనేత సంఘాలకు ఎన్నికలు పెట్టే ధైర్యం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. అనంతరం పాతబస్తీ హనుమాన్నగర్లో స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చేనేత కార్మిక సమస్యలపై పద్మశాలి సంఘం నాయకులు ఎంపీకి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పోతెపాక లింగస్వామి, మిర్యాల వెంకటేశ్వర్లు, గడ్డం మహేష్, కాశమ్మ, కంచర్ల విద్యాసాగర్రెడ్డి, పకీరు మోహన్రెడ్డి, పాలకూరి రవి పాల్గొన్నారు.