
కురిసిన వర్షం.. రైతన్న హర్షం
భువనగిరిటౌన్, రామన్నపేట: జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం రాత్రి, బుధవారం తెల్లవారుజామున మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు ఆనందంగా పొలంబాట పట్టారు. ఏరువాక పౌర్ణమి కావడంతో వ్యవసాయ పరికరాలను శుభ్రం చేసి కాడెద్దులు, నాగళ్లకు పూజలు చేసి పొలాలకు కదిలారు. కొందరు దుక్కులు దున్నగా, మరికొందరు విత్తనాలు వేశారు. అత్యధికంగా ఆత్మకూర్(ఎం), ఆలేరు మండలాల్లో 44 మి.మీ వర్షం కురిసింది. పది రోజులుగా ఎండలు ఠారెత్తించగా.. వర్షానికి వా తావరణం చల్లబడింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
వర్షపాతం మి.మీలలో
ఆత్మకూర్(ఎం) 49, ఆలేరు 44, మోటకొండూరు 31, చౌటుప్పల్ 42, సంస్థాన్నారాయణపురం 21, రామన్నపేట 19, భూదాన్పోచంపల్లి 19, భువనగిరి 13, వలిగొండ 9, రాజాపేట 7, బొమ్మలరామారం మండలంలో 6 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.
ఫ ఏరువాక పౌర్ణమి రోజు పలుచోట్ల వర్షం
ఫ పొలంబాట పట్టిన రైతులు