చదువుతో పాటు ఆటలకు ప్రాధాన్యం ఇచ్చేవాడిని | - | Sakshi
Sakshi News home page

చదువుతో పాటు ఆటలకు ప్రాధాన్యం ఇచ్చేవాడిని

Jun 12 2025 2:55 AM | Updated on Jun 12 2025 2:55 AM

చదువుతో పాటు ఆటలకు ప్రాధాన్యం ఇచ్చేవాడిని

చదువుతో పాటు ఆటలకు ప్రాధాన్యం ఇచ్చేవాడిని

మా సొంతూరు చౌటుప్పల్‌. నేను స్థానికంగా ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు విద్యాభ్యాసం చేశాను.టెన్త్‌ 1985–86 బ్యాచ్‌. చదువుతోపాటు ఆటలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవాడిని. స్నేహితులతో కలిసి గాంధీ పార్కులో రకరకాల ఆటలు ఆడేవాళ్లం. ఆటల్లో పడి భోజనం కూడా చేసేవాడిని కాదు. వేసవి సెలవుల్లో బంధువుల ఇళ్లకు వెళ్లేవాడిని. సెలవులు ముగిసిన అనంతరం ఆనందంగానే స్కూల్‌కు వెళ్లేవాడిని. పాఠశాలలో చేరిన మొదట్లో కొన్ని రోజుల వరకు మా కుటుంబసభ్యులు తోలి వెళ్లేది. ఆ తర్వాత స్నేహితులతో కలిసే వెళ్లాను. మధ్యాహ్నం స్నేహితులతో కలిసి ఇంటికి వచ్చి భోజనం చేసి వచ్చేవాళ్లం. నాటి రోజులు ఇంకా గుర్తుకొస్తుంటాయి. విద్యార్థులకు చదువుతోపాటు సమాజంపై అవగాహన ఉండాలి. 31 సంవత్సరాలుగా వివిధ హోదాలో ఉద్యోగం చేస్తున్నా. విద్యార్థులను అన్ని విధాలా తీర్చిదిద్దడం కోసం నావంతు కృషి చేస్తున్నా. ఇప్పుడు విద్యార్థులు సెల్‌ఫోన్‌, టీవీలు, సోషల్‌మీడియా వైపు వెళ్తున్నారు. వాటిలో మంచి కూడా ఉన్నప్పటికీ అవసరం ఉన్నంత వరకే వినియోగించాలి.

–అలిసేరు గోవర్ధన్‌, బాసర ట్రిపుల్‌ ఐటీ వైస్‌ చాన్స్‌లర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement