
నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ ఉద్యోగులు
దేవరకొండ: ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలు పోగొట్టుకున్న బంగారు చెవి కమ్మలు, కొంత నగదును తిరిగి వారికి అందజేసి బస్సు డ్రైవర్, కండక్టర్ తమ నిజాయితీని చాటుకున్నారు. చింతపల్లి మండలానికి చెందిన మహిళా ప్రయాణికురాలు బుధవారం దేవరకొండ నుంచి సంతోష్నగర్కు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కింది. సంతోష్నగర్ వెళ్లగానే అర్ధ తులం బంగారు చెవి కమ్మలు, కొంత నగదు ఉన్న చిన్న బాక్స్ను బస్సులోనే మర్చిపోయి దిగింది. గమనించిన డ్రైవర్ నజీరుద్దీన్, కండక్టర్ దార యాదయ్య ఆ బాక్స్ను డిపోలోని అధికారులకు అందజేశారు. డిపో ఏడీసీ ఉపేందర్ విచారణ చేసి సంబంధిత ప్రయాణికురాలి కుటుంబసభ్యులకు దేవరకొండ డిపోలో అందజేశారు.