
తహసీల్దార్ కార్యాలయాల వద్ద దరఖాస్తుదారుల నిరీక్షణ
రాజాపేట: రెవెన్యూ సదస్సుల నిర్వహణలో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుండటంతో కులం, ఆదాయం వంటి ధ్రువీకరణ పత్రాల కోసం విద్యార్థులు, సంక్షేమ పథకాల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకుందుకు తహసీల్దార్ కార్యాలయాలకు నిత్యం వందల సంఖ్యలో వస్తున్నారు. క్షేత్రస్థాయి విధులకు వెళ్లిన అధికారులు కార్యాలయాల్లో అందుబాటులో ఉండకపోవడంతో దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను ఎవరికి ఇవ్వాలో తెలియని పరిస్థితి నెలకొంది.