
మోత్కూరులో చోరీకి యత్నం
మోత్కూరు: మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలీ కాలనీలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి చోరీకి యత్నించాడు. పద్మశాలీ కాలనీలో ఉంటున్న పోచం అనసూయ రాత్రి సమయంలో ఇంటికి వెనుకవైపు ఉన్న కిటికీ మూసేందుకు వెళ్లింది. అదే సమయంలో ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడేందుకు యత్నించగా ఆమె అప్రమత్తమై కేకలు వేసింది. ఇరుగుపొరుగు వారు రావడంతో దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కాలనీ వాసులు ఇంటి పరిసరాల్లో వెతికినా ఎవరూ కనిపించలేదు. కొద్దిదూరంలో బైక్ కనిపించగా.. దాని యజమాని కనిపించకపోవడంతో 100 నంబర్కు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకొని, బైక్ను స్వాధీనం చేసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు.
కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం
నాగారం : సూర్యాపేట – జనగాం జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట మండల పరిఽధిలోని నాగారంబంగ్లా గ్రామానికి చెందిన దోమల వెంకన్న(49) నాగారం ఎక్స్రోడ్డు వద్ద ఫెర్టిలైజర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి తన బైక్పై వర్థమానుకోట రోడ్డు నుంచి నాగారంబంగ్లాలోని తన ఇంటికి వస్తున్నాడు. అదే సమయంలో సూర్యాపేట నుంచి తిరుమలగిరి వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి వెనుక నుంచి బైక్ను ఢీకొట్టింది. దీంతో వెంకన్న తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య దోమల ఉమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ ఐలయ్య తెలిపారు.
ఫ కేకలు వేయడంతో నిందితుడు పరారు
ఫ అతడి బైక్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు