
టీపీసీసీ ప్రధాన కార్యదర్శులుగా ముగ్గురికి అవకాశం
ఆలేరు, వలిగొండ : టీపీసీసీ నూతన కార్యకవర్గంలో జిల్లా నుంచి ఇద్దరికి చోటు లభించింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులైన ఆలేరుకు చెందిన జనగాం ఉపేందర్రెడ్డి, పల్లె శ్రీనివాస్ గౌడ్, వలిగొండ మండలం టేకులసోమారం వాసి కసుబా శ్రీనివాసరావును ప్రధాన కార్యదర్శులుగా అధిష్టానం నియమించింది. దీంతో ఉపేందర్రెడ్డి మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వీరి నియామకం పట్ల పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషిచేస్తామని పేర్కొన్నారు.
ఫ ఆలేరు నుంచి జనగాం ఉపేందర్రెడ్డి, పల్లె శ్రీనివాస్గౌడ్
ఫ వలిగొండ నుంచి కసుబా
శ్రీనివాసరావు నియామకం

టీపీసీసీ ప్రధాన కార్యదర్శులుగా ముగ్గురికి అవకాశం