
వాసాలమర్రిలో అధికారుల సర్వే
తుర్కపల్లి : వాసాలమర్రి గ్రామ పునర్నిర్మాణ పనులకు నూతన ప్రణాళిక రూపొందించాలన్న కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు మంగళవారం గ్రామంలో రీసర్వే నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులతో రెండు రోజుల క్రితం జరిగిన సర్వేను ఆధారంగా తీసుకొని ఇంటింటి రీసర్వే చేపట్టారు. అనంతరం తహసీల్దార్ దేశ్యానాయక్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ఇతర అధికారులు గ్రామ సచివాలయంలో సమావేశమయ్యారు. కార్యదర్శులతో చర్చించి పలు వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ఎంపీఓలు దినకర్, సలీం, ఆవుల కిషన్, పంచాయతీ కార్యదర్శులు ఒగ్గు మధు, దార మహేందర్, సాయి, నవీన్, కొండయ్య, సురేష్, మణిప్రసాద్, బాలరాజ్, నాగరాజు, చందర్, సందీప్రెడ్డి, కారోబార్ ప్రశాంత్ పాల్గొన్నారు.