
నేడే ఏరువాక పౌర్ణమి
ఆర్మీ మహిళా డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు
బీబీనగర్: మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండలలోని అంకుశాపూర్ పరిధిలో గల ప్రిన్స్టన్ ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతున్న యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఆర్మీ మహిళా డిగ్రీ కళాశాలలో 2025–26 సంవత్సరానికి గాను అడ్మిషన్ల దరఖాస్తులు స్వీకరిస్తున్నుట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీలత మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ పాసైన మహిళా అభ్యర్థులు ఈ నెల 23వ తేదీ లోపు కళాశాలలో దరఖాస్తులు చేసుకోవచ్చని ఆమె తెలిపారు. ఇంటర్మీడియట్ మెమో, బోనాఫైడ్ సర్టిఫికెట్ తో పాటు 2025 జనవరి తర్వాత పొందిన ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్కార్డు జిరాక్స్, ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు సమర్పించాలని సూచించారు. ఎంపీసీ, ఎంఎస్సీఎస్, ఎంజెడ్సీ, బీజెడ్సీ, బీకాం, సీఏ గ్రూపులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 7995010687, 7981199283 నంబర్లను సంప్రదించాల ప్రిన్సిపాల్ సూచించారు.
హాలియా, రామన్నపేట: తొలకరి జల్లులు.. రైతన్నల మోములో చిరునవ్వు.. పుడమి తల్లి పులకరింతకు సాక్ష్యమే ఏరవాక పౌర్ణమి. ప్రతి ఏడాది వైశాఖ మాసం ముగిసి జ్యేష్ఠ మాసం మొదలైన తర్వాత వర్షాలు కురవడం మొదలవుతాయి. జ్యేష్ఠ పౌర్ణమి నాటికి తొలకరి వర్షాలు పడి భూమి మెత్తబడుతుంది. దీంతో రైతులు దుక్కులు దున్నడం, వ్యవసాయ పనులను ఏరువాకతోనే మొదలుపెడతారు. బుధవారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక కథనం.
ఏరువాక అంటే..
ప్రతి ఏటా జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు జరుపుకునే వేడుకనే ఏరువాక అంటారు. ఏరు అంటే ఎద్దులను నాగలికి కట్టి దున్నడానికి సిద్ధం చేయడం అని అర్ధం. ఈ రోజు రైతులు కాడెద్దులను కడిగి వాటి కొమ్ములకు రంగులు పూసి, మెడలో గజ్జెలు, గంటలతో అలంకరిస్తారు. ఎడ్లకు కట్టే కాడిని పూజించి, ఎద్దులకు భక్షాలు తినిపిస్తారు. పొలాలకు వెళ్లి భూతల్లికి పూజలు చేసి దుక్కి దున్నడం ప్రారంభిస్తారు. తొలకరి జల్లుల ఆగమనంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య వ్యవసాయ పనులు మొదలు పెడతారు.
ఏరువాక పౌర్ణమి నేపథ్యం..
ఏరువాకను జ్యోతిష్య శాస్త్రవేత్తలు కష్యారంభం, సస్యారంభం అని వ్యవహరిస్తారు. భారతదేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఏరువాక పౌర్ణమి జరుపుకుంటారు. జ్యేష్ఠ మాసంలో ప్రారంభమయ్యే నైరుతి రుతుపవనాల ప్రభావం అంతటా ఒకేలా ఉంటుంది. 80శాతం వర్షం నైరుతి రుతుపవనాల వల్లనే కలుగుతుంది. దీంతో పొలం పనులకు ఆటంకం కలగవద్దని, పంటలు సమృద్ధిగా పండాలని రైతులు ఏరువాకను మహా యజ్ఞంగా పరిగణించి ఆచరిస్తారు. రామాయణంలో నాగేటి సాళ్లల్లో సీతమ్మ అమ్మవారు దొరికింది కాబట్టి సీతా యజ్ఞంగా కూడా భావిస్తారు. ఇదే రోజున ఒడిశాలోని పూరీ జగన్నాథుడికి స్నానోత్సవం కూడా నిర్వహిస్తారు. అదేవిధంగా పూర్వం శ్రీకృష్ణదేవరాయల వారు తన పాలనా కాలంలో ఏరువాక పండుగ రోజున రైతుల శ్రమ, కృషిని గుర్తించి తగిన రీతిలో రైతులను ప్రోత్సహించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఇదే రోజున శుద్ధోదన రాజు కపిలవస్తులో లాంఛనంగా ఏరువాకను ప్రారంభించి బంగారు నాగలిని రైతులను బహూకరించినట్లు పురాణ కథలు చెబుతున్నాయి.
ఏరువాకతో దున్నడం ప్రారంభిస్తాం
ఏరువాక పౌర్ణమి రోజు మా ఊర్లో రైతులందరం కలిసి వ్యవసాయ పనిముట్లు, భూదేవికి, ఎద్దులకు పూజలు చేస్తాం. అనంతరం నాగళ్లు కట్టి దుక్కులు దున్నడం ప్రారంభిస్తాం. వర్షాలు అనుకున్నట్లు పడితే ఈ ఏడాది వ్యవసాయ సాగుకు ఎలాంటి ఢోకా ఉండదు.
– అనుముల శ్రీనివాస్రెడ్డి, రైతు, త్రిపురారం
వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది
ఆధునిక పరిజ్ఞానం పెరగడం, యంత్రాలను విరివిగా ఉపయోగించడం, ప్రభుత్వం వివిధ రూపాల్లో తగిన ప్రోత్సాహం అందించడం వల్ల కొంతకాలంగా వ్యవసాయరంగం బాగా అభివృద్ధి చెందింది. పంటల దిగుబడి గణనీయంగా పెరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలతో రైతులకు చాలా మేలు జరుగుతుంది. వివిధ రంగాల్లో స్థిరపడిన వారి దృష్టి సైతం వ్యవసాయం వైపు మళ్లింది.
– కూనూరు రమేష్ రైతు సిరిపురం, రామన్నపేట
ఫ వానాకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతులు
ఈ ఏడాది ఆశాజనకంగా ఉంటుందని ఆశిస్తున్నాం
2025–26 వ్యవసాయ సీజన్కు అవసరమైన విత్తనాలు, ఎరువులు డీలర్ల వద్ద, పీఏసీఎస్లలో అందుబాటులో ఉన్నాయి. మెట్ట పంటలు సాగు చేసే రైతులు 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయిన తర్వాతే పత్తి, కంది సాగు చేయాలి. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిసి మంచి దిగుబడులు వచ్చి రైతులకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం. – డి. గోపాల్, యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయాధికారి

నేడే ఏరువాక పౌర్ణమి

నేడే ఏరువాక పౌర్ణమి

నేడే ఏరువాక పౌర్ణమి

నేడే ఏరువాక పౌర్ణమి