
రేపు పోచంపల్లికి గవర్నర్ రాక
భూదాన్పోచంపల్లి: భూదాన్పోచంపల్లికి గురువారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ రానున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేనేత జౌళిశాఖ రాష్ట్ర అధికారులతో కలిసి స్థానిక టూరిజం పార్కుతో పాటు సమీపంలోని చేనేత కార్మికుల గృహాలను సందర్శించారు. టూరిజం పార్కులో చేనేత వస్త్రాల తయారీ విధానాలను గవర్నర్ పరిశీలించనున్న నేపథ్యంలో పార్కులో తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా టూరిజం పార్కులోని కాన్ఫరెన్స్ హాల్లో చేనేత కార్మికులు, కళాకారులు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలతో గవర్నర్ ముఖాముఖి నిర్వహించనుండడంతో అక్కడ చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు. చేనేత బీమా, త్రిఫ్ట్ పథకం చెక్కులను గవర్నర్ లబ్ధిదారులకు అందజేయనున్న నేపథ్యంలో ఎంపిక చేసిన పోచంపల్లి, కుంట్లగూడేనికి చెందిన చేనేత కార్మికులకు సమాచారం ఇచ్చి వారు సకాలంలో కార్యక్రమానికి హాజరయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గవర్నర్ చేనేత కార్మికుల గృహాలను సైతం సందర్శించి మగ్గాలను ప్రత్యక్షంగా పరిశీలించి వారి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకొంటారని.. దీంతో టూరిజం పార్కు సమీపంలో ఉన్న చేనేత కార్మికులైన భారత భాస్కర్, భారత మధు, పొట్టబత్తిని శేఖర్ ఇళ్లను పరిశీలించారు. అనంతరం రెవెన్యూ, మున్సిపల్, చేనేత జౌళిశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట రాష్ట్ర చేనేత జౌళిశాఖ డైరెక్టర్లు వెంకటేశ్వర్రావు, ఇందుమతి, రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ పద్మ, జిల్లాఏడీ శ్రీనివాస్రావు, చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్రెడ్డి, తహసీల్దార్ పి. శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అంజన్రెడ్డి, ఎస్ఐ భాస్కర్రెడ్డి, జౌళిశాఖ అభివృద్ధి అధికారి రాజేశ్వర్రెడ్డి, చేనేత నాయకులు తడక రమేశ్, భారత లవకుమార్, అంకం పాండు, ఏలే భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
గవర్నర్ పర్యటన ఇలా..
గురువారం ఉదయం 10.45 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్వర్మ పోచంపల్లికి చేరుకుంటారు. 11.15 వరకు చేనేత గృహాల సందర్శన, 11.15 నుంచి 11.30 గంటలకు టూరిజం పార్కును సందర్శించి పార్కులో చేనేత వస్త్ర తయారీ ప్రక్రియను పరిశీలిస్తారు. 11.30 నుంచి మధ్యాహ్నం 12గంటలకు చేనేత కార్మికులతో ముఖాముఖి సమావేశం ఉంటుంది. మధ్యాహ్నం 12.15 వరకు చేనేత కార్మికులకు బీమా, త్రిఫ్ట్ ఫండ్ చెక్కుల పంపిణీ చేస్తారు. అనంతరం 12.15 గంటల తర్వాత గవర్నర్ తిరిగి రాజ్భవన్కు పయనమవుతారు. అయితే గవర్నర్ పర్యటన షెడ్యూల్డ్ అధికారికంగా ఖరారు కావాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు.
ఫ ఏర్పాట్లను పరిశీలించిన యాదాద్రి
భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు