
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని ఎస్ఎల్బీసీ రోడ్డులో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. వన్ టౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హాలియా నుంచి అతివేగంగా వస్తున్న కారు నల్లగొండ నుంచి ఎస్ఎల్బీసీ వైపు వెళ్తున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడేనికి చెందిన వంశీ (22) అక్కడికక్కడే మృతిచెందాడు. అదే గ్రామానికి చెందిన బైక్ నడుపుతున్న రుద్రాక్షి తిలక్ స్వల్పంగా గాయపడ్డాడు. వీరు పేటీఎం కంపెనీలో పనిచేస్తున్నారు. కారు బైక్ను ఢీకొట్టిన తర్వాత పక్కనే ఉన్న ఫాస్ట్ఫుడ్ సెంటర్లోకి దూసుకెళ్లింది ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వాహకులు అప్రమత్తమై తప్పించుకోవడంతో వారికి ప్రాణపాయం తప్పింది. ఈ ఘటనలో కారు టైరు పేలిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారులో ఉన్న వ్యక్తులు ఏపీలోని శ్రీకాకుళంకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ సీఐ తెలిపారు.
తల్లిదండ్రులు
మందలించారని ఆత్మహత్య
గుర్రంపోడు: రోజూ మద్యం తాగి ఇంటికి వస్తున్న కుమారుడిని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుర్రంపోడు మండలం తెరాటిగూడెం గ్రామంలో జరిగింది. ఎస్ఐ పసుపులేటి మధు తెలిపిన వివరాల ప్రకారం.. తెరాటిగూడెం గ్రామానికి చెందిన నారబోయిన సురేందర్(20) రోజూ మద్యం తాగి ఇంటికి వస్తుండేవాడు. సోమవారం కూడా సురేందర్ మద్యం తాగి ఇంటికి రావడంతో.. ఆరోగ్యం దెబ్బతింటుందని తల్లిదండ్రులు నారబోయిన అచ్చమ్మ, మల్లయ్య మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన సురేందర్ ఇంట్లో నుంచి వెళ్లిపోయి తమ బత్తాయి తోట లో పురుగుల మందు తాగాడు. చుట్టుపక్కల రైతులు గమనించి 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడి తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.