
సాంకేతిక లోపంతో నిలిచిపోయిన జన్మభూమి ఎక్స్ప్రెస్
రామగిరి(నల్లగొండ): సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇంజన్లో మంగళవారం సాంకేతిక లోపం ఏర్పడింది. నల్లగొండ రైల్వే స్టేషన్కు రైలు ఉదయం 9.10 గంటలకు వచ్చింది. అదే సమయంలో ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తి అక్కడే ఆగిపోయింది. అప్పటికే ప్లాట్ఫాం మీదకు వచ్చిన హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఫలక్నూమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను అధికారులు నిలిపివేశారు. సిబ్బంది మరమ్మతులు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. రెండు రైళ్లు సుమారు గంటకు పైగా నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో రైలు ఇంజన్ను తెప్పించి జన్మభూమి రైలును పంపించారు. ఆ వెంటనే ఫలక్నూమా రైలు కూడా వెళ్లింది. 10.20 గంటలకు రెండు రైళ్లు కదిలాయి. సుమారు గంటకు పైగా ప్రయాణికులు అనేక అవస్థలు పడ్డారు.
ఫ లైన్ సిగ్నల్ లేక ఫలక్నూమా..
ఫ నల్లగొండ రైల్వే స్టేషన్లో గంటకు పైగా నిలిచిన రెండు రైళ్లు