యాదగిరీశుడి సన్నిధిలో ట్రైనీ ఐఏఎస్‌ అధికారులు | - | Sakshi
Sakshi News home page

యాదగిరీశుడి సన్నిధిలో ట్రైనీ ఐఏఎస్‌ అధికారులు

Jun 10 2025 3:12 AM | Updated on Jun 10 2025 3:12 AM

యాదగి

యాదగిరీశుడి సన్నిధిలో ట్రైనీ ఐఏఎస్‌ అధికారులు

యాదగిరిగుట్ట: హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శిక్షణ పొందుతున్న 2024 బ్యాచ్‌కు చెందిన ట్రైనీ ఐఏఎస్‌ అధికారులు సౌరబ్‌ శర్మ, సలోని ఛబ్రా, హర్ష చౌదరి, కరోలిన్‌ చింగ్తియన్మయి, కొయ్యడ ప్రణయ్‌కుమార్‌ సోమవారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తుల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. వారికి అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. అంతకుముందు ట్రైనీ ఐఏఎస్‌ అధికారులకు ఆర్డీఓ కృష్ణారెడ్డి, తహసీల్దార్‌ గణేష్‌ స్వాగతం పలికారు.

జైన మందిరంలో పూజలు..

ఆలేరురూరల్‌: ఆలేరు మండలం కొలనుపాకలోని జైన మందిరం, సోమేశ్వరాలయాన్ని కూడా ట్రైనీ ఐఏఎస్‌ అధికారులు సందర్శించారు. ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి పరిసరాలను పరిశీలించారు. వారి వెంట ఆర్డీఓ తదితరులు ఉన్నారు.

యాదగిరీశుడి సన్నిధిలో ట్రైనీ ఐఏఎస్‌ అధికారులు1
1/1

యాదగిరీశుడి సన్నిధిలో ట్రైనీ ఐఏఎస్‌ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement