ప్రజలు కేసీఆర్‌ పాలన కోరుకుంటున్నారు | - | Sakshi
Sakshi News home page

ప్రజలు కేసీఆర్‌ పాలన కోరుకుంటున్నారు

Apr 25 2025 1:04 AM | Updated on Apr 25 2025 1:04 AM

ప్రజలు కేసీఆర్‌ పాలన కోరుకుంటున్నారు

ప్రజలు కేసీఆర్‌ పాలన కోరుకుంటున్నారు

రాజాపేట: కాంగ్రెస్‌ పాలనను వ్యతిరేకిస్తున్న ప్రజలు కేసీఆర్‌ పాలనే కావాలని కోరుకుంటున్నారని డీసీసీబీ మాజీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. 27న వరంగల్‌లో జరిగే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ సందర్భంగా గురువారం రాజాపేటలో నిర్వహించిన ఆ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు చేయడంలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు రూ.2,500, కల్యాణలక్ష్మి, రైతు భరోసా, రైతు రుణమాఫీ ఇవ్వకుండా మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతుందని విమర్శించారు. వరంగల్‌ ఎల్కతుర్తిలో జరగనున్న బహిరంగ సభకు ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు తిరుమలేష్‌, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు గోపాల్‌ గౌడ్‌, నాయకులు భాస్కర్‌ గౌడ్‌, సంతోష్‌ గౌడ్‌, గుంటి కృష్ణ, రామచంద్రారెడ్డి, కటుకం స్వామి, రామిండ్ల నరేందర్‌, వీరేశం, ఉప్పలయ్య గౌడ్‌, ప్రమోద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement