
పోగొట్టుకున్న బ్యాగు బాధితుడికి అప్పగింత
నిడమనూరు: వెండి వస్తువులు గల బ్యాగును ఆటో మర్చిపోగా.. నిడమనూరు పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో ఆటోను గుర్తించి బ్యాగును బాధితుడికి అందజేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండల కేంద్రానికి చెందిన అన్నెబోయిన శివకుమార్ తన ఇంట్లో శుభకార్యానికి కావాల్సిన 25 తులాల వెండి వస్తువులను హైదరాబాద్లో కొనుగోలు చేసి బ్యాగులో పెట్టుకొని నిడమనూరుకు వస్తున్నాడు. అలీనగర్ (14వ మైలు) దగ్గర ఆటో దిగి నిడమనూరుకు వెళ్తూ.. ఆటోలో శివకుమార్ తన బ్యాగును మరిచిపోయాడు. వెంటనే నిడమనూరు పోలీసులను ఆశ్రయించగా.. సీసీ కెమెరాల సహాయంతో ఆటోను గుర్తించి బ్యాగును బాధితుడు శివకుమార్కు అందజేసినట్లు ఎస్ఐ వి. నరేష్ తెలిపారు.