ఉండి మండలం ఉణుదుర్రులో ఇళ్ల కోసం బాధితులు పోరాటం సాగిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి తమ నిరసన తెలిపారు. 8లో u
ఆచంట నియోజకవర్గమంతా మట్టి మాఫియా, ఇసుక మాఫియాగా తయారైంది. అక్రమ తవ్వకాలను అడ్డుకున్న వారిపై అక్రమంగా కేసులు బనాయించి వేధిస్తున్నారు. అక్రమ కేసులకు ఎవరూ భయపడేది లేదు. రెడ్బుక్ పేరుతో భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారు. ఎంత మంది మీద అక్రమ కేసులు బనాయించినా వెనకడుగు వేసేది లేదు. అక్రమ మట్టి, ఇసుక తవ్వకాల మీద పోరాటం చేస్తాం. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా నిలుస్తాం.
– చెరుకువాడ శ్రీరంగనాథరాజు,
నియోజకవర్గ వైఎస్సార్సీపీ కన్వీనర్
ఆచంట నియోజకవర్గంలో రెడ్బుక్ రాజ్యాంగం మొదలైందని కూటమి నాయకులు సోషల్ మీడియాల్లో పోస్టులు పెడుతున్నారు. అక్రమ తవ్వకాలను అడ్డుకున్న సీనియర్ నేత సుంకర సీతారామ్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. లోకేష్ రెడ్ బుక్ పట్టుకున్న ఫొటోతో వాట్సప్లో పెట్టి మరి కొంతమంది వైఎస్సార్సీపీ నాయకులను అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. కూటమి నాయకులు బెదిరింపులకు లొంగకుండా అక్రమ తవ్వకాలు, ఇసుక దందాలపై పోరాడతాం.
– కె.వేణుబాబు, వైఎస్సార్సీపీ నేత


