కొడమంచిలి మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ కోటే శశిమధు, మాజీ సర్పంచ్ సీతారామ్ను బుధవారం ఆచంట పోలీసులు అరెస్టు చేసి పాలకొల్లు కోర్టులో హాజరుపర్చారు. 420, 409 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. గ్రామంలో జరిగిన ఉపాధి పనుల్లో రూ.4.09 లక్షల మేర అక్రమాలు జరిగినట్టు ఆచంట ఎంపీడీఓ బీఎన్ఎస్ఎస్ కృష్ణమోహన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ నిధులను అక్రమంగా మళ్లించినట్టు తమ దర్యాప్తులో తేలినట్టుగా పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కోటే శశిమధు
సుంకర సీతారామ్


