ఉంగుటూరు: మండలంలోని బాదంపూడి మత్స్య శిక్షణ కేంద్రంలో శిక్షణకు యువకులు కరువయ్యారు. ఔత్సాహికులైన అభ్యర్థులకు ఇక్కడ మత్స్య శిక్షణ ఇస్తారు. ఇది ప్రభుత్వ మత్స్య శాఖ ద్వారా నడుస్తోంది. ఈ శిక్షణ కేంద్రంలో స్టైఫండులో 20 మందికి, నాన్ స్టైఫండుతో 20 మందికి శిక్షణ ఇచ్చేవారు. మూడు నెలలు శిక్షణ కోర్సులో శిక్షణ పాందేందుకు గతంలో యువకులు పోటీ పడేవారు. అయితే మత్స్య శిక్షణ పొందేందుకు అభ్యర్థులు కరువు అయ్యారు. కనీసం 20 మంది కూడా రావడం లేదు. ఇన్ ల్యాండు ఫిషరీస్ ట్రైనింగ్ పొందిన వారికి మూడునెలలు సర్టిఫికెటు ఇస్తారు. ఈ సర్టిఫికెటుతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఫీల్డ్ మెన్ ఉద్యోగాలు వచ్చేవి అయితే ఇటీవల కాలంలో ఈ శిక్షణకు ఆదరణ తక్కువైంది. ప్రభుత్వం కూడా శిక్షణ గురించి యువతకు అవగాహన కల్పించడం లేదు. దీంతో ఎంతో ప్రాచుర్యం ఉన్న మత్స్య శిక్షణ కేంద్రం నిరుపయోగంగా మారుతుంది.


