ఏఐపై మరిన్ని పరిశోధనలు జరగాలి | - | Sakshi
Sakshi News home page

ఏఐపై మరిన్ని పరిశోధనలు జరగాలి

Jun 27 2025 4:04 AM | Updated on Jun 27 2025 4:04 AM

ఏఐపై

ఏఐపై మరిన్ని పరిశోధనలు జరగాలి

తాడేపల్లిగూడెం (టీఓసీ): విశ్వ విద్యాలయ పరిధిలోని పరిశోధన, బోధన, విస్తరణ రంగాల పురోగతిని బలోపేతం చేసేందుకు డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వ విద్యాలయం, యూఎస్‌ఏ కాన్సాస్‌ స్టేట్‌ యూనివర్సిటీలు పరస్పర ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. విశ్వ విద్యాలయం ఉప కులపతి డాక్టర్‌ కే.గోపాల్‌, డాక్టర్‌ పీవీ వర ప్రసాద్‌, యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఆర్‌ఓ కృస్‌, ఎండోడ్‌ ప్రొఫెసర్‌, డైరక్టర్‌ సెంటర్‌ ఫర్‌ క్రాప్స్‌, క్‌లైమేట్‌ అండ్‌ కమ్యూనిటీస్‌, కాలేజీ ఆఫ్‌ అగ్రికల్చర్‌, యూఎస్‌ఏ కాన్సాస్‌ స్టేట్‌ యూనివర్సిటీ సభ్యులు గురువారం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. గోపాల్‌ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటిల్‌జెన్సీ, మెషిన్‌ లెర్నింగ్‌, డీప్‌ లెర్నింగ్‌ వంటి ఉద్యాన సంబంధిత పరిశోధనలు మరిన్ని జరగాలన్నారు. డాక్టర్‌ వర ప్రసాద్‌ మాట్లాడుతూ విశ్వ విద్యాలయంలోని ఫ్యాకల్టీ, విద్యార్థులకు ఉపయోగపడేలా అనుబంధ పరిశోధన, అధ్యాపక అవకాశాలు కల్పిస్తారన్నారు. డాక్టర్‌ కే.ధనుంజయ్‌ రావు, అధికారులు ఎం.మాధవి, బి.శ్రీనివాసులు, ప్రసన్నకుమార్‌, ఎస్‌శ్రీ విజయపద్మ, జి.రామానందం అసోసియేషన్‌ డీన్‌లు, విద్యార్థినీ, విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.

వివాహితపై హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్‌

భీమవరం (ప్రకాశం చౌక్‌): బ్లేడుతో వివాహితపై హత్యాయత్నం జరిపిన కేసులో నిందితుడిని పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. భీమవరం డీఎస్పీ జయసూర్య స్థానిక వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. తనను వివాహం చేసుకోవాలని పట్టణానికి చెందిన పొలిశెట్టి హేమంత్‌ వివాహిత మామిడి నాగసూర్యమణిపై ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించడంతో బుధవారం హేమంత్‌ బ్లేడుతో నాగమణిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్పీ, డీఎస్పీ పర్యవేక్షణలో వన్‌టౌన్‌ సీఐ ఆధ్వర్యంలో నాలుగు టీమ్‌లు ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు హేమంత్‌ భీమవరం బైపాస్‌ రోడ్డులో ఉన్నట్లు గుర్తించి గురువారం ఉదయం 11 గంటలకు అతడిని అరెస్ట్‌ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. విచారణలో నాగమణి పెళ్లికి తిరస్కరించడంతో కోపంతోనే ఆమైపె హత్యాయత్నానికి పాల్పడినట్లు నిందితుడు హేమంత్‌ నేరం అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ నాగరాజు, ఎస్సైలు కిరణకుమార్‌, కృష్ణాజీలను డీఎస్పీ అభినందించారు.

ఏఐపై మరిన్ని పరిశోధనలు జరగాలి  1
1/1

ఏఐపై మరిన్ని పరిశోధనలు జరగాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement