లారీ రూపంలో కబళించిన మృత్యువు | - | Sakshi
Sakshi News home page

లారీ రూపంలో కబళించిన మృత్యువు

Jun 27 2025 4:04 AM | Updated on Jun 27 2025 4:04 AM

లారీ

లారీ రూపంలో కబళించిన మృత్యువు

భీమడోలు, మండవల్లి: మోటార్‌సైకిల్‌ను లారీ ఢీకొన్న ఘటనలో భార్య మృతి చెందగా భర్తకు గాయాలయ్యాయి. పూళ్ల పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల ప్రకారం మండవల్లి మండలం కొవ్వాడలంక గ్రామానికి చెందిన ఘంటసాల రామృష్ణ, సీతామహాలక్ష్మి పూళ్ల పంచాయతీ పరిధిలోని ఎంఎంపురం గ్రామంలో నివాసముంటున్నారు. కుమార్తె మోరు లక్ష్మీతిరుపతమ్మ ఆనారోగ్యం కారణంగా ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆస్పత్రిలో ఉన్న కుమార్తెకు భోజనం తీసుకువెళ్లేందుకు రామకృష్ణ, సీతామహాలక్ష్మి మోటార్‌సైకిల్‌పై ఏలూరుకు బయలుదేరారు. మార్గమధ్యమైన పూళ్ల పంచాయతీ వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న టిప్పర్‌ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సీతామహాలక్ష్మి (61) అక్కడిక్కడే మృతి చెందింది. భర్త రామకృష్ణకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న భీమడోలు ఎస్సై వై.సుధాకర్‌ ఘటనా స్థలానికి చేరకుని పరిశీలించారు. రామకృష్ణ ఫిర్యాదు మేరకు ఎస్సై సుధాకర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీతామహాలక్ష్మి మృతితో ఎంఎంపురం గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

మోటార్‌సైకిల్‌ను ఢీకొన్న లారీ

భార్య మృతి, భర్తకు గాయాలు

లారీ రూపంలో కబళించిన మృత్యువు 1
1/1

లారీ రూపంలో కబళించిన మృత్యువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement