
● మావుళ్లమ్మకు ఉయ్యాల సేవ
భీమవరం మావుళ్లమ్మ అమ్మవారి జ్యేష్ఠమాస జాతర మహోత్సవాల్లో భాగంగా
ఆఖరి రోజు బుధవారం అమ్మవారికి ఉయ్యాల సేవ నిర్వహించారు. పుట్టింటి, అత్తింటి వారు అల్లూరి, మెంటే వంశస్తులచే ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఈ కార్యక్రమాన్ని జరిపారు. అలాగే అమావాస్య సందర్భంగా మావుళ్లమ్మ
దేవస్థానంలో చండీహోమం నిర్వహించారు. ఈ హోమంలో 60 మంది దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమాల్లో ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మీ నగేష్, ఆలయ
అధికారులు, భక్తులు పాల్గొన్నారు. – భీమవరం (ప్రకాశం చౌక్)