ఎల్‌ఐసీ ఏజెంట్ల సంక్షేమానికి కృషి | - | Sakshi
Sakshi News home page

ఎల్‌ఐసీ ఏజెంట్ల సంక్షేమానికి కృషి

Jun 23 2025 5:26 AM | Updated on Jun 23 2025 5:26 AM

ఎల్‌ఐసీ ఏజెంట్ల సంక్షేమానికి కృషి

ఎల్‌ఐసీ ఏజెంట్ల సంక్షేమానికి కృషి

ఏలూరు (టూటౌన్‌): భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)లో పనిచేస్తున్న ఏజెంట్ల సంక్షేమానికి కృషి చేయడంలో ఎల్‌ఐసీ ఏఓఐ సంఘం ఎప్పుడూ ముందుంటుందని ఆ సంఘ సౌత్‌ సెంట్రల్‌ జోనల్‌ (ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు) ప్రధాన కార్యదర్శి పీఎల్‌ నరసింహారావు అన్నారు. ఆ సంఘ మహాసభ ఆదివారం ఏలూరులో పవర్‌ పేట ఉద్దరాజు రామం భవనంలో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న నరసింహారావు మాట్లాడుతూ ఎల్‌ఐసీ ఏజెంట్ల కమీషన్లు తగ్గించటపై సంఘం ఉద్ధృతంగా పోరాడుతోందన్నారు. అనేక పోరాటాల ఫలితంగానే కొన్ని హక్కులను సాధించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆహ్వాన సంఘం అధ్యక్షుడు తాళం సురేష్‌, స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌ కోడే రాంబాబు, మెంబర్‌ వైఎస్‌ కనకారావు, సీనియర్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ ఎస్‌.శ్రీనివాసరావు, భీమడోలు బ్రాంచ్‌ మేనేజర్‌ ఎన్‌.భువన దీప, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్‌, ఎల్‌ఐసీ ఏవోఐ రాష్ట్ర అధ్యక్షుడు టి.కోటేశ్వరరావు, జనరల్‌ సెక్రటరీ జి రవి కిషోర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement