112 బస్సులపై కేసులు | - | Sakshi
Sakshi News home page

112 బస్సులపై కేసులు

Jun 21 2025 3:51 AM | Updated on Jun 21 2025 3:51 AM

112 బస్సులపై కేసులు

112 బస్సులపై కేసులు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రవాణా కమిషనరు ఆదేశాల మేరకు గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు కలపర్రు టోల్‌గేట్‌ వద్ద తనిఖీలు నిర్వహించి.. 112 కాంట్రాక్టు క్యారేజ్‌ బస్సులు, వాణిజ్య, వాణిజ్యేతర వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.3.67 లక్షల అపరాధ రుసుం విధించినట్లు ఇన్‌చార్జ్‌ ఉప రవాణా కమిషనరు కేఎస్‌ఎంవీ కృష్ణారావు తెలిపారు. విశాఖపట్నం నుంచి విజయవాడ, విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య తిరిగే కాంట్రాక్టు బస్సులను తనిఖీ నిర్వహించి పర్మిట్‌ నిబంధనలను ఉల్లంఘించిన బస్సులపై కేసులు నమోదు చేశామన్నారు. వాణిజ్య వాహనాలపై పన్ను చెల్లించకుండా, పర్మిట్‌, ఫిట్‌నెస్‌, డ్రైవింగ్‌ లైసెనన్స్‌ వంటి లేకుండా నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక తనిఖీల్లో జంగారెడ్డిగూడెం ఇన్‌చార్జ్‌ ఆర్టీవో ఎస్‌.రంగనాయకులు, వాహన తనిఖీ అధికారులు జీ ప్రసాదరావు, జీ స్వామి, వై సురేష్‌ బాబు, కళ్యాణి, కృష్ణవేణి, అన్నపూర్ణ, డీ ప్రజ్ఞ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement