
నేడు భీమవరానికి బొత్స రాక
భీమవరం: భీమవరంలో శనివారం నిర్వహించనున్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలోని కుముదవల్లి రోడ్డులోని నర్సయ్య అగ్రహారం వద్ద గల ఏఎస్ రాజు కల్యాణ మండపంలో ఉద యం 10 గంటలకు ప్రారంభం కానున్న సమావేశానికి పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. గత కొన్ని నెలలుగా పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త లేకపోవడం, ఇటీవల భీమవరం మండలం రాయ లం గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు చినమిల్లి వెంకట్రాయుడును సమన్వయకర్తగా నియమించడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈ క్రమంలో జరిగే సమావేశానికి భీమవరం పట్టణం, వీరవాసరం, భీమవరం మండలాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కా ర్యకర్తలు తరలివచ్చి పార్టీ సత్తా చూపించడానికి సమాయత్తమవుతున్నారు. సమావేశానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజుతోపాటు ఆరు నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ నా యకులు, కార్యకర్తలు భారీగా హాజరుకానుండటంతో ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరు