సచివాలయాల్లో కూటమి బదిలీలలు | - | Sakshi
Sakshi News home page

సచివాలయాల్లో కూటమి బదిలీలలు

Jun 20 2025 6:45 AM | Updated on Jun 20 2025 6:45 AM

సచివా

సచివాలయాల్లో కూటమి బదిలీలలు

భర్తకు దేహశుద్ధి
కొయ్యలగూడెంలోని ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి ఆయన భార్య దేహశుద్ధి చేసింది. తనకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగింది. IIలో u
స్వశక్తితో ఉద్యోగాలు సాధించి గ్రామ, వార్డుస్థాయిలో సేవలందిస్తున్న సచివాలయ ఉద్యోగులను కూటమి నేతల చెప్పుచేతల్లో పెట్టే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఉద్యోగుల బదిలీలపై స్పష్టత లేని జీఓ ఇచ్చిన కూటమి ప్రభుత్వం.. ఎన్నడూ లేనివిధంగా బదిలీల్లో రాజకీయ జోక్యానికి తెరలేపింది. ఈ మేరకు వీఐపీ (మంత్రి/ఎమ్మెల్యే/ఎంపీ) పేరిట సిఫార్సు లేఖల కోసం ప్రొఫార్మాలో ప్రత్యేక కాలమ్‌ ఏర్పాటుచేసింది.

ఈ సమ్మర్‌ కూల్‌ గురూ..

వేసవి ఆరంభంలోనే ఎండలు అదరగొట్టాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అందరూ భావించగా అందుకు భిన్నంగా మే నెలలో వాతావరణం చల్లబడింది. IIలో u

శురకవారం శ్రీ 20 శ్రీ జూన్‌ శ్రీ 2025

సాక్షి, భీమవరం: నెలాఖరు నాటికి సచివాలయ ఉద్యోగుల బదిలీలను పూర్తిచేసేందుకు మూడు రోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. మే నెలాఖరవు నాటికి ఒకే చోట ఐదేళ్ల కాలం పూర్తిచేసుకున్న వారి బదిలీ తప్పనిసరి. అలాగే ఐదేళ్లు పూర్తికాకున్నా రిక్వెస్ట్‌ ట్రాన్స్‌ఫర్‌ కోరుకునే వారికి అవకాశం ఇచ్చారు. అభ్యర్థన బదిలీ కావాలనుకునే వారు ఈనెల 22 నుంచి 24వ తేదీలోపు రిక్వెస్ట్‌ ట్రాన్సఫర్‌ మాడ్యూల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలోని సొంత మండలాల్లో పనిచేసే వెసులుబాటును తొలగించింది. ఒకే చోట ఐదేళ్లుగా పనిచేస్తున్న వారి వివరాలను ఇప్పటికే ఎంపీడీఓ, మున్సిపల్‌ కమిషనర్లు సిద్ధం చేశారు. 25 నుంచి 29లోపు ప్రాధాన్యతను అనుసరించి బదిలీలు పూర్తిచేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఉద్యోగి పనిచేసే విభాగాన్ని బట్టి సంబంధిత శాఖల పర్యవేక్షణలో బదిలీలు జరుగుతాయి.

సచివాలయ ఉద్యోగులపై కక్ష

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న విమర్శలున్నాయి. సర్వేల పేరిట తిప్పడం, గతంలో వలంటీర్లు చేసిన పనులను వీరికి అప్పగించడం ద్వారా పనిభారం పెంచేసింది. క్లస్టర్ల పేరిట ఉద్యోగులను క్రమబద్ధీకరించి మిగిలిన వారిని ఇతర శాఖల్లో భర్తీ చేసే యోచన చేస్తోంది. కేవలం రూ.29 వేల నుంచి రూ.31 వేల జీతంపై పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులు సొంత మండలాల్లో పనిచేయకూడదన్న కూటమి ఆదేశాలు ఇవ్వడం, బదిలీలపై స్పష్టత ఇవ్వకపోవడం వారిని మరింత ఇబ్బంది పెట్టేందుకేనని పలువురు విమర్శిస్తున్నారు.

గత ప్రభుత్వంలో పారదర్శకంగా..

ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేస్తూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయ వ్యవస్థను తెచ్చారు. రాజకీయ జోక్యం, అవినీతి, అక్రమాలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా సచివాలయ ఉద్యోగుల నియామకాలు చేశారు. గ్రామాల్లో రెండు వేలు, పట్టణాల్లో నాలుగు వేల జనాభా ప్రాతిపధికన సచివాలయాలను ఏర్పాటుచేశారు. గ్రేడ్‌ 4 పంచాయతీ కార్యదర్శి, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌, ఏఎన్‌ఎం, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌, విలేజ్‌ సర్వేయర్‌, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్‌, ఉద్యాన అసిస్టెంట్‌, డిజిటల్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టులను నియమించించారు. తద్వారా జిల్లాలో వేలాది మంది నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. 35 శాఖలకు చెందిన 500లకు పైగా సేవలను అందుబాటులోకి తెచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయాలను నిర్వీర్యం చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది.

న్యూస్‌రీల్‌

సిఫార్సుల పర్వం

ఉద్యోగులను కూటమి నేతల చెప్పుచేతల్లో పెట్టే ఎత్తుగడ

బదిలీల నిర్వహణపై స్పష్టత లేని జీఓ

మెరిట్‌ను పక్కనపెట్టి సిఫార్సు లేఖలున్న వారికే ప్రాధాన్యం

ఈ మేరకు ప్రొఫార్మాలో వీఐపీ కాలమ్‌

సిఫార్సు లేఖల కోసం నేతల వద్దకు ఉద్యోగుల ప్రదక్షిణలు

చెప్పినట్టు పనిచేసే వారికే ఎమ్మెల్యేల లేఖలు

జిల్లాలో 4,434 మంది సచివాలయ ఉద్యోగులు

సచివాలయాల్లో పారదర్శకతకు పెద్దపీట వేసిన గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం

రాజకీయ జోక్యానికి ఆస్కారం లేకుండా ఉద్యోగుల నియామకాలు, బదిలీలు

ఉద్యోగుల్లో గందరగోళం

సాధారణంగా వెబ్‌, ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌, మెరిట్‌, ర్యాకింగ్‌, మ్యూచవల్‌ విధానంలో బదిలీలు జరుగుతుంటాయి. గత ప్రభుత్వంలో రాజకీయ జోక్యానికి తావివ్వకుండా కౌన్సెలింగ్‌ నిర్వహించి ర్యాంకింగ్‌ మేరకు పోస్టింగ్‌లు ఇచ్చేవారు. తాజా బదిలీల్లో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఏ విధానాన్ని అనుసరించేది కూటమి ప్రభుత్వం స్పష్టం చేయకపోవడం ఉద్యోగులను గందరగోళానికి గురిచేస్తోంది. సర్వేయర్లు బదిలీలకు సంబంధించిన ప్రొఫార్మాలో వీఐపీ రికమెండేషన్స్‌ (మంత్రి/ ఎమ్మెల్యే/ ఎంపీ) పేరుతో ప్రత్యేక కాలమ్‌ను ఏర్పాటుచేయడం సిఫార్సు లేఖల ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది.

ఎమ్మెల్యేల వద్దకు బారులు

జిల్లాలో 393 గ్రామ, 142 వార్డు సచివాలయ పరిధిలో 4,434 మంది సచివాలయ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో దాదాపు 70 శాతం మంది బదిలీ అవుతారని అంచనా. స్థానిక నేతలను ప్రసన్నం చేసుకోవడం ద్వారా సిఫార్సు లేఖల కోసం సచివాలయ ఉద్యోగులు కూటమి ఎమ్మెల్యేల ఇళ్లకు క్యూ కడుతున్నారు. తమ చెప్పుచేతల్లో పనిచేసే వారి పేర్లను ఎమ్మెల్యేలకు సూచించి కావాల్సిన వారికి కవరింగ్‌ లెటర్లు ఇప్పించే పనిలో నాయకులు ఉన్నారు. ప్రస్తుతం జిల్లాలోని ఎమ్మెల్యేల నివాసాలు సిఫార్సు లేఖల కోసం వస్తున్న సచివాలయ ఉద్యోగులతో కిటకిటలాడుతున్నాయి.

సచివాలయాల్లో కూటమి బదిలీలలు1
1/2

సచివాలయాల్లో కూటమి బదిలీలలు

సచివాలయాల్లో కూటమి బదిలీలలు2
2/2

సచివాలయాల్లో కూటమి బదిలీలలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement