
యోగా భారత ప్రాచీన సంపద
భీమవరం: యోగా దేశ ప్రాచీన సంపద అని, ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది భారతదేశం అని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. స్థానిక డీఎన్నార్ కళాశాలలోని మైదానంలో గురువారం ప్రత్యేక థీమ్ అథ్లెటిక్స్, స్పోర్ట్స్, యూత్ గ్రూప్స్తో నిర్వహించిన మెగా యోగా ప్రదర్శన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా సాధనతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు, పీఏసీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందన్నారు. కలెక్టర్ సీహెచ్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి, అడిషనల్ ఎస్పీ వి.భీమారావు, డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, ఆర్డీఓలు, అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

యోగా భారత ప్రాచీన సంపద