యథేచ్ఛగా కంకర అక్రమ తవ్వకాలు | - | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా కంకర అక్రమ తవ్వకాలు

Jun 20 2025 5:23 AM | Updated on Jun 20 2025 5:23 AM

యథేచ్ఛగా కంకర అక్రమ తవ్వకాలు

యథేచ్ఛగా కంకర అక్రమ తవ్వకాలు

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌ : కూటమి పాలనలో మట్టి దందా దోచుకున్నోళ్లకు దోచుకున్నంత అన్న చందంగా తయారైంది. కోర్టు నుంచి స్టే ఉన్నా వారు లెక్క చేయని పరిస్థితి. ఉంగుటూరు మండలం నల్లమాడులో కంకర అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మూడు తరాల నుంచి ఒక పేద కుటుంబం హక్కు భుక్తంలో ఉన్న మెరసుకుంటను ఆనుకొని ఉన్న సుమారు ఒకటిన్నర ఎకరం కంకర బీడులో 15 రోజులుగా ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగిస్తున్నారు. పెద్ద ఎత్తున కంకరను జేసీబీలు, పొక్లయినర్ల సాయంతో తవ్వి లారీలు, ట్రాక్టర్ల ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ముసనబోయిన అంజమ్మకు చెందిన ఈ భూమి విషయంలో హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా కూటమి నాయకలు లెక్కచేయడం లేదు. పంచాయతీ, ఇరిగేషన్‌ అధికారుల అనుమతితో తవ్వకాలు చేస్తున్నట్లు ఆ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో గ్రామ, మండల స్థాయి అధికారుల జేబులు నింపుతున్నారని వినికిడి. కంకర తవ్వకాలపై గ్రామ రెవెన్యూ అధికారి నాగరాజుని వివరణ కోరగా కంకర తవ్వకాలకు అనుమతులు ఉన్నట్లు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement