భర్తకు దేహశుద్ధి చేసిన భార్య | - | Sakshi
Sakshi News home page

భర్తకు దేహశుద్ధి చేసిన భార్య

Jun 20 2025 5:23 AM | Updated on Jun 20 2025 5:23 AM

భర్తక

భర్తకు దేహశుద్ధి చేసిన భార్య

కొయ్యలగూడెం: భర్తకు భార్య దేహశుద్ధి చేసిన ఘటన గురువారం కొయ్యలగూడెంలో చోటుచేసుకుంది. బాధితురాలు పూజిత తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొయ్యలగూడెంలో ప్రైవేట్‌ బ్యాంకులో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావుకు చిట్యాల గ్రామానికి చెందిన పూజితకు 11 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు ఆడపిల్లలు సంతానం. అయితే మగపిల్లాడు కావాలని పూజితను అత్తమామలు, భర్త వేధింపులకు గురి చేస్తున్నారు. ఆమె నుంచి విడాకులు కావాలని భర్త కోర్టును ఆశ్రయించగా కోర్టు పూజితకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో బంధువులు, మహిళ మండలి సంఘాల మద్దతుతో గురువారం పూజిత శ్రీనివాసరావు ఇంటికి వెళ్లగా అదే సమయంలో భర్త మరో మహిళతో విహహేతర సంబంధం పెట్టుకొని సహజీవనం చేస్తున్నాడని తెలియడంతో అవాక్కయింది. పైగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళకు ఆరు నెలల పాప ఉందని తెలియడంతో ఆమెను కూడా తీసుకొని బ్యాంకు వద్దకు వెళ్లి నిరసన తెలిపింది. దీంతో శ్రీనివాసరావు, పూజితల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా మహిళా సంఘాలు బంధువులు కలిసి శ్రీనివాసరావుకు దేహశుద్ధి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శ్రీనివాసరావును, పూజితను స్టేషన్‌కు తీసుకుని వెళ్లారు. కోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు పూజిత కోరుతోంది. కాగా దీనిపై పూర్తిస్థాయి విచారణ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడంపై ఆవేదన

భర్తకు దేహశుద్ధి చేసిన భార్య 1
1/1

భర్తకు దేహశుద్ధి చేసిన భార్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement