
యానాం మద్యం విక్రేతకు రూ.లక్ష జరిమానా
తణుకు అర్బన్: యానాం మద్యం విక్రయాలు చేస్తున్న వ్యక్తికి ఇరగవరం మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, తహసీల్దార్ ఎం.సుందరరాజు రూ.లక్ష జరిమానా విధించినట్లు తణుకు ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ సీఐ సత్తి మణికంఠరెడ్డి తెలిపారు. ఇరగవరం మండలం కంతేరు గ్రామానికి చెందిన కొవ్వూరి శ్రీనివాసరెడ్డి ఇటీవల రెండు పర్యాయాలు యానాం మద్యంతో దొరికిన నేపథ్యంలో ఈ భారీ జరిమానా విధించినట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది మార్చి 7న కంతేరు గ్రామంలో కారులో 43.1 లీటర్ల యానం మద్యం తరలిస్తూ తణుకు ఎకై ్సజ్ శాఖ దాడుల్లో పట్టుబడ్డాడని, దీంతో అతడిని ఇరగవరం మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వద్ద రూ.లక్ష పూచీకత్తుతో ఏడాది కాలానికి బైండోవర్ చేయడం జరిగిందన్నారు. సత్ప్రవర్తన బాండ్ను ఉల్లంఘించి తిరిగి మే 26న యానాం నుంచి మద్యాన్ని కారులో రవాణా చేస్తూ తణుకు ఎక్సైజ్ శాఖకు మరోసారి పట్టుబడ్డాడని చెప్పారు. దీంతో ఈనెల 11న ఇరగవరం తహసీల్దార్ వద్ద హాజరపరచగా దీనిపై విచారణ అనంతరం విధించిన జరిమానాను ముద్దాయి గురువారం చెల్లింపు చేసినట్లు వివరించారు.
యువకుడి అదృశ్యంపై కేసు నమోదు
ముదినేపల్లి రూరల్ : యువకుడి అదృశ్యంపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల ప్రకారం మండలంలోని పెదగొన్నూరు శివారు కర్షకమాలపల్లికి చెందిన మద్దాల మరియమ్మ కుమారుడు కిరణ్బాబు ముదినేపల్లి, బంటుమిల్లి, సింగరాయపాలెం గ్రామాల్లోని స్వీటుషాపుల్లో పనిచేసేవాడు. ప్రతిరోజు వచ్చే ఆదాయంతో మద్యం సేవించి తల్లిని దుర్భాషలాడుతూ బాధపెట్టేవాడు. ఈ ఏడాది మార్చి 30న మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వమని తల్లి మరియమ్మను ఒత్తిడి చేశాడు. అందుకు నిరాకరించడంతో తల్లిని తూలనాడి ఇంటినుంచి వెళ్లిపోయాడు. నాటి నుంచి కిరణ్బాబు ఆచూకీ తెలియకపోవడంతో తల్లి మరియమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై వీరభద్రరావు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
కామ్రేడ్ సుధాకర్ సేవలు ఎనలేనివి
పెదపాడు: మండలంలోని సత్యవోలులో కామ్రేడ్ తెంటు సుధాకర్ సంస్మరణ సభ గురువారం నిర్వహించారు. సీపీఐఎంల్ సానుభూతిపరులు, విరసం నాయకులు, కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థిగా, డాక్టర్గా, కామ్రేడ్గా సుధాకర్ ఎనలేని సేవలందించారని కొనియాడారు. పేద, బడుగు, పీడిత ప్రజల కోసమే సుధాకర్ తన జీవితాన్ని త్యాగం చేశారని, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కొండారెడ్డి, కృష్ణ లావేటి శ్రీనివాసరావు, తూర్పు కాపు కార్పొరేషన్ డైరక్టరు లావేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
మద్ది హుండీల ఆదాయం రూ.54.71 లక్షలు
జంగారెడ్డిగూడెం: మండలంలోని గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో హుండీ ఆదాయన్ని గురువారం లెక్కించినట్టు మద్ది ఈఓ ఆర్వీ చందన తెలిపారు. 85 రోజులకు హుండీల ద్వారా రూ.49,67,182, చిల్ల రూపేణా రూ.4,22,927, అన్నదానం హుండీ ద్వారా రూ.81,370 మొత్తం ఆదాయం రూ.54,71,479 వచ్చినట్టు చెప్పారు. ఏలూరు దేవదాయ శాఖ ఆధ్వర్యంలో గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ఈఓ కలగర శ్రీనివాస్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేవీబీ బ్యాంకు సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

యానాం మద్యం విక్రేతకు రూ.లక్ష జరిమానా

యానాం మద్యం విక్రేతకు రూ.లక్ష జరిమానా