
బాబు మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారు
తాడేపల్లిగూడెం అర్బన్: హామీలను నెరవేర్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై ప్రజలు నమ్మకంతో ఉన్నారని, 143 హామీలిచ్చి ఒక్కటి కూడా నూరుశాతం అమలు చేయలేని చంద్రబాబు మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో బుధవారం మాజీ మంత్రి కొట్టు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే చేసిన అప్పు రూ.1.50 లక్షల కోట్లని, ఏం చేశాడో లెక్కలు లేవన్నారు. అన్యాయం జరిగితే ప్రశ్నిస్తానన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎక్కడా నోరు మెదపడంలేదన్నారు. ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో కూటమి ప్రభుత్వం రోజుకో డైవర్షన్ పాలిటిక్స్తో ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని అన్నారు. పచ్చమీడియా బాబు మాదిరి ప్రజలను మోసం చేస్తోందని వ్యాఖ్యానించారు. సూపర్ సిక్స్ హామీల్లో సీ్త్ర శక్తి, ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి, కొత్త పింఛన్లు ఇంతవరకూ అమలు చేయకపోవడం చంద్రబాబు చేతకాని పాలనకు నిదర్శమన్నారు. నారా లోకేష్ రెడ్ బుక్ పాలన పేరుతో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను నిద్రావస్థలోకి పంపించాడన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే సాక్షాత్తు మహిళా హోం మంత్రి మాట్లాడకపోవడం దారుణమన్నారు. అనధికార బార్లు, దాబాలు, కోడి పందేలు, మహిళలపై లైంగిక దాడులతో నియోజకవర్గం రాష్ట్రంతో పోటీపడుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే తప్పులు చేసిన వారికే వత్తాసు పలుకుతూ బాధితులకు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్కు సిఫార్సులు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో కొలుకులూరి ధర్మరాజు, కర్రి భాస్కరరావు, కై గాల శ్రీనివాసు, గుండుమోగుల సాంబయ్య, వీరయ్య, కంటమని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.