మహిళలకు రక్షణ కరువు | - | Sakshi
Sakshi News home page

మహిళలకు రక్షణ కరువు

Jun 19 2025 7:50 AM | Updated on Jun 19 2025 7:50 AM

మహిళలకు రక్షణ కరువు

మహిళలకు రక్షణ కరువు

వైఎస్సార్‌ సీపీ జిల్లా మహిళ అధ్యక్షురాలు విజయలక్ష్మి

భీమవరం: రాష్ట్రం కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ లేదని, మహిళలపై దాడులు పెచ్చుమీరిపోయాయని వైఎస్సార్‌సీపీ మహిళ జిల్లా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం భీమవరంలో విలేకర్ల సమావేశంలో కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. వృద్ధులు, చిన్నారులని చూడకూండా మానవ మృగాలు ప్రభుత్వ అండతో రెచ్చిపోతున్నారని వారిని అదుపుచేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు మహిళను చెట్టుకు కట్టి చిత్రహింసలకు గురి చేశారన్నారు. రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో విద్యకు అఽత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అమ్మ ఒడి పథకాన్ని ఎంతో పటిష్టంగా అమలుచేస్తే నేటి కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో అనర్హులంటూ లక్షలాది మందికి మొండిచేయి చూపిందని, తండ్రికి మాత్రం విచ్చల విడిగా మద్యం అమ్మకాలు చేయిస్తున్నారని చెప్పారు. హామీలు అమలుచేయలేక అంకెల గారడీతో ప్రజల మఽభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు తగిన సమయంలో గట్టిగా బుద్దిచెబుతారని విజయలక్ష్మి హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement