
అంబేడ్కర్ ఆశయాలు కొనసాగిద్దాం
వనపర్తి రూరల్: అంబేడ్కర్ ఎంతో కష్టపడి ప్రపంచంలో ఉన్నత స్థానానికి ఎదిగారని.. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగుదామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి కోరారు. బుధవారం మండలంలోని మెంటేపల్లిలో డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని స్థానిక నాయకులతో కలిసి గజమాల వేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో అంటరానితనం నిర్మూలనకు అక్షరమనే ఆయుధాన్ని ఎక్కుపెట్టిన దార్శనికుడు అంబేడ్కర్ అన్నారు. విద్యార్థులు శ్రద్ధతో చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలనే ఉద్దేశంతో పాఠశాల ఎదుట విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో యువ నాయకుడు డా. జిల్లెల ఆదిత్యారెడ్డి, టీపీసీసీ ప్రధానకార్యదర్శి నందిమళ్ల యాదయ్య, డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్యాదవ్, నాయకులు చీర్ల జనార్దన్, కోళ్ల వెంకటేష్, సతీష్ మాదిగ, జానకిరాముడు, నారాయణ, రాములు, అంబేడ్కర్ యూత్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ప్రవేశపత్రాలు అందజేత..
గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి పాల్గొని చిన్నారులకు 1వ తరగతిలో ప్రవేశానికి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు ఉచితంగా పాఠ్య, రాత పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం అందిస్తుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలో చేర్పించి బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సునీల్కుమార్, గీతారాణి, గ్రామపంచాయతీ కార్యదర్శి శంకర్రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.