దోమలు బాబోయ్‌..! | - | Sakshi
Sakshi News home page

దోమలు బాబోయ్‌..!

Jun 20 2025 6:45 AM | Updated on Jun 20 2025 6:45 AM

దోమలు

దోమలు బాబోయ్‌..!

పట్టణాల్లో

పడకేసిన పారిశుద్ధ్యం

దోమల బెడద అధికం..

కాలనీలోని డ్రెయినేజీల్లో నాలుగు నెలలకు ఓసారి మురుగు తొలగిస్తున్నారు. దీంతో దుర్వాసన, దోమల బెడద అధికమైంది. సాయంత్రం అయిందంటే చాలు ఇంటి తలుపులు మూసుకోవాల్సిందే. అధికారులు స్పందించి క్రమం తప్పకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలి.

– విష్ణువర్ధన్‌ యాదవ్‌, అమరచింత

మురుగు తొలగించడం లేదు..

ఒకటో వార్డులోని నాగుల బావిలో మురుగు చేరి పరిసరాలు అపరిశుభ్రంగా తయారయ్యాయి. రాంనగర్‌ నుంచి వస్తున్న మురుగు కాల్వలను నేరుగా బావిలోకి వెళ్లేలా నిర్మాణం చేశారు. పారిశుద్ధ్య చర్యలు చేపట్టకపోవడంతో దోమల బెడద అధికమై ఇబ్బందులు పడుతున్నాం. – బాలకృష్ణ, అమరచింత

దోమల నివారణకు చర్యలు..

పురపాలికలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు వార్డుల వారీగా ఫాగింగ్‌ చేపట్టేందుకు చర్యలు చేపట్టాం. పట్టణంలో పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు తగిన ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. – శిశిధర్‌,

ఇన్‌చార్జ్‌ పుర కమిషనర్‌, అమరచింత

మరుగునపడిన ఫాగింగ్‌ యంత్రాలు

తూతూమంత్రంగా

వంద రోజుల కార్యక్రమం

అమరచింత: పురపాలికల్లో మురుగు కాల్వల్లో పేరుకుపోయిన పూడికను తొలగించకపోవడంతో దుర్గందం వెదజల్లడమే గాకుండా దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. దోమల నివారణకు ప్రతి పురపాలికలో ఫాగింగ్‌ యంత్రాలు కొనుగోలు చేసినా సగానికిపైగా మరమ్మతులకు గురికావడంతో నిరుపయోగంగా మారాయి. ముందస్తుగా కురిసిన వర్షాలకు కుంటల్లో నీరుచేరి దోమలు వృద్ధి చెందుతున్నా.. వాటిని నిర్మూలించే ప్రయత్నాలు మాత్రం పుర అధికారులు చేపట్టడం లేదు.

● జిల్లాలోని వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూర్‌, అమరచింత పురపాలికల్లో మొత్తం 14 ఫాగింగ్‌ యంత్రాలు ఉన్నాయి. దోమల నివారణకు గతంలో నీటి నిల్వ ప్రాంతాల్లో గంబూషియా చేపలు వదిలేవారు. అవి లార్వాను తినేసి దోమల ఉత్పత్తిని తగ్గించేవి. అంతేగాకుండా భ్లీచింగ్‌ పౌడర్‌, సున్నం వంటి వాటిని చల్లి దోమల బెడద నుంచి ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తుండేవారు. కాని ఇలాంటి పనులు సైతం ఎక్కడా కనిపించడం లేదు. అప్పుడప్పుడు బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడంతోనే సరిపెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభం కావడంతో దోమలు, ఈగల బెడదను అరికట్టి విషజ్వరాల బారి నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత పుర అధికారులపై ఉంది.

పారిశుద్ధ్యానికి అరకొర నిధులు..

పారిశుద్ధ్య పనులకు నిధులను పూర్తిస్థాయిలో వినియోగించడంలో అధికారులు విఫలమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన వార్డుల వారీగా ఎన్ని ఫాగింగ్‌ యంత్రాలు అవసరం అవుతాయనే వివరాలను సైతం ఇప్పటి వరకు గుర్తించకపోవడం ఏమిటని పుర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పురపాలికల్లో వందరోజుల ప్రణాళికలో స్వచ్ఛత కార్యక్రమాలు తూతూమంత్రంగా చేపడుతున్నారని.. కేవలం ఫొటోలకు ఫోజులిచ్చి వెళ్లిపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. చేపట్టాల్సిన పనులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడంతో ప్రత్యేక అధికారులు సైతం ప్రత్యేక దృష్టి సారించలేకపోతున్నారు.

పురపాలికల వారీగా ఇలా..

వనపర్తిలో ఆరు ఫాగింగ్‌ యంత్రాలు ఉండగా.. వీటిలో మూడు పని చేయడం లేదు. అమరచింతలో 1, ఆత్మకూర్‌లో 1, కొత్తకోటలో 1, పేబ్బెర్‌లో 5 ఫాగింగ్‌ యంత్రాలు ఉండగా.. వీటిలో 2 మరమ్మతుకు గురయ్యాయి.

దోమలు బాబోయ్‌..! 1
1/3

దోమలు బాబోయ్‌..!

దోమలు బాబోయ్‌..! 2
2/3

దోమలు బాబోయ్‌..!

దోమలు బాబోయ్‌..! 3
3/3

దోమలు బాబోయ్‌..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement