‘నమ్మక ద్రోహులకు పార్టీలో స్థానం లేదు’ | - | Sakshi
Sakshi News home page

‘నమ్మక ద్రోహులకు పార్టీలో స్థానం లేదు’

Jun 19 2025 3:50 AM | Updated on Jun 19 2025 3:50 AM

‘నమ్మక ద్రోహులకు పార్టీలో స్థానం లేదు’

‘నమ్మక ద్రోహులకు పార్టీలో స్థానం లేదు’

వనపర్తి రూరల్‌: నమ్మక ద్రోహులకు బీఆర్‌ఎస్‌ పార్టీలో స్థానం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని తన స్వగృహంలో పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాల పార్టీ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమై అనుసరించాల్సిన విధానాలపై దిశా నిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సిద్ధంగా ఉండాలని.. కాంగ్రెస్‌ ప్రభుత్వ మోసపూరిత విధానాలతో అప్రమత్తంగా ఉండి సంక్షేమ పథకాల మోసాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పార్టీకి విధేయులు, ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవచూపే నాయకులకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాల ఎగవేతపై ప్రజలకు వివరించాలన్నారు. అందరూ సంఘటితంగా ఉండి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్‌, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్‌, మీడియా కన్వీనర్‌ నందిమళ్ల అశోక్‌, పార్టీ మండల అధ్యక్షుడు వనం రాములు, దిలీప్‌రెడ్డి, వెంకటస్వామి, విండో చైర్మన్‌ జగన్నాథంనాయుడు, నాయకులు కర్రెస్వామి, పృథ్విరాజ్‌, రాజశేఖర్‌, కృష్ణారెడ్డి, పెద్దింటి వెంకటేష్‌, సూగూరు పరశురాం, మాధవరెడ్డి, ఆనంద్‌, గోవింద్‌నాయుడు, వడ్డె రమేష్‌, చిట్యాల రాము తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement