నిధులున్నా.. నిట్టూర్పే | - | Sakshi
Sakshi News home page

నిధులున్నా.. నిట్టూర్పే

Apr 7 2025 12:19 AM | Updated on Apr 7 2025 12:19 AM

నిధుల

నిధులున్నా.. నిట్టూర్పే

మిట్టనందిమళ్ల పనులు ప్రతిపాదనలోనే..

నందిమళ్ల క్రాస్‌రోడ్‌ నుంచి గ్రామం వరకు సుమారు 4 కిలోమీటర్ల రహదారిని బీటీగా మార్చేందుకు సుమారు రూ.4.50 కోట్లు అవసరమని అధికారులు గతేడాది ప్రతిపాదనలు పంపించారు. కిష్టంపల్లి క్రాస్‌రోడ్‌ నుంచి మిట్టనందిమళ్ల వరకు రహదారి పూర్తిగా దెబ్బతినడంతో ఆయా గ్రామస్తులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పాలనలో గ్రామాల మీదుగా వెళ్లే రహదారిని బీటీగా మార్చాలని పాలకులు, అధికారులకు పలుమార్లు విన్నవిస్తూనే ఉన్నామని.. నేటికీ ప్రతిపాదనకే వదిలేశారని చెబుతున్నారు.

అమరచింత: అమరచింత, ఆత్మకూర్‌ మండలాల్లోని వీరరాఘవాపురం, నందిమళ్ల, ధర్మాపురం గ్రామాలకు బీటీ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరైనా.. పనుల్లో పురోగతి కనిపించడం లేదు. ఆయా గ్రామాల రహదారులను బీటీగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5.60 కోట్లు మంజూరు చేసింది. ఆర్నెల్ల కిందటే అధికారులు టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసినా.. నేటికీ కాంట్రాక్టర్‌ పనులు ప్రారంభించకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అమరచింత మండలంలోని చంద్రగఢ్‌ క్రాస్‌రోడ్‌ నుంచి నందిమళ్ల వరకు, ధర్మాపురం గేట్‌ నుంచి గ్రామం వరకు బీటీ రహదారి నిర్మాణానికిగాను రూ.5 కోట్లు మంజూరయ్యాయి. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి గ్రామ రహదారిని అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని.. దీంతో 2.50 కిలోమీటర్లు నడుచుకుంటూ స్టేజీ వరకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవచూపి బీటీ పనులు త్వరగా ప్రారంభించి వేసవి చివరి నాటికి పూర్తి చేయాలని కోరుతున్నారు.

6 నెలల కిందటే..

వీరరాఘవాపురం, ధర్మాపురం, నందిమళ్ల గ్రామాల బీటీ పనులకు ఆరు నెలల కిందటే అధికారులు టెండర్‌ ప్రక్రియ పూర్తి చేశారు. పనులు త్వరలోనే ప్రారంభిస్తామని పంచాయతీరాజ్‌శాఖ అధికారులు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి చెప్పారే తప్ప నేటికీ ప్రారంభించలేదు. పనులు త్వరగా పూర్తి చేద్దామనే ఆలోచన సదరు కాంట్రాక్టర్‌కు కలుగకపోవడం ఏమిటని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో జరిగే సభలు, సమావేశాల్లో రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని చెప్పుకొస్తున్నారే తప్ప ఇప్పటి వరకు పనులు ఎందుకు చేపట్టలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు.

బీటీగా మారని మట్టి రహదారులు

5.50 కి.మీ. నిర్మాణానికి రూ.5.60 కోట్లు మంజూరు

మిట్టనందిమళ్ల బీటీ పనులుప్రతిపాదనలకే పరిమితం

టెండర్‌ పూర్తయినా పురోగతి శూన్యం

నిధులున్నా.. నిట్టూర్పే 1
1/1

నిధులున్నా.. నిట్టూర్పే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement